TTD released Additional August quota online today తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన భక్తులకు టీటీడీ శుభవార్త..

Tirumala ttd released additional august quota online today

TTD, Srivari darshan tickets, Online darshan tickets, Special Entry Darshan, Cheating case, Travel agency, Tirumala, Tirumala News, TTD, Tirumala tirupati Devasthanam, TTD Board, TTD Chairman, Laddu prasadams, Andhra pradesh, politics

The online quota of Rs 300 special entry darshan additional tickets for the month of August had been released today ie on July 28 at 11 am. Daily 3,000 Additional tickets will be available on line for the devotees for advance booking of the darshan tickets online.

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన భక్తులకు టీటీడీ శుభవార్త..

Posted: 07/28/2021 01:32 PM IST
Tirumala ttd released additional august quota online today

కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల తిరుపతి భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్తను అందించింది. అందులోనూ శ్రీవారిని ప్రత్యేక దర్శనం ద్వారా వీక్షించాలని ఆశపడే భక్తుల కోసం కొంత వెసలుబాటు కల్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్ లైన్‌ టికెట్లు హాట్ కేకుల్లా అయిపోతున్న పరిస్థితిపై దృష్టిసారించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. భక్తుల నుంచి వస్తున్న వినతులను పరిగణలోకి తీసుకుని శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను మరిన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఆగస్ట్ నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇదివరకే ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచంగా అవి కేవలం గంటల వ్యవధిలోనే బుక్ అయ్యాయి. దీంతో టీటీడీ బోర్డుకు భక్తుల నుంచి విన్నతులు వెళ్లాయి. తాము ఎంతగానో వేచి చూస్తున్నప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకునేలోపునే అయిపోయాయని.. దయచేసి ఈ సంఖ్యను పెంచాలని భక్తులు కోరారు. ఇక దీనితో పాటు ప్రత్యేక ధర్శన టికెట్లకు భక్తుల నుంచి లభిస్తున్న విశేష స్పందన నేపథ్యంలోనూ టీటీడీ చక్కటి నిర్ణయం తీసుకుంది. ఇదివరకు విడుదల చేసిన కోటాకు అదనంగా మళ్లో కోటాను విడుదల చేశారు.

ఈ అదనపు ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటల నుంచి టీటీడీ వెబ్ సైట్ లో టిక్కెట్లను అందుబాటులో ఉంచింది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు అదనంగా రోజుకు మూడు వేల టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేసింది. శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను అదనంగా అందించి భక్తులకు శుభవార్తను చెప్పగా వాటికి కూడా విశేష స్పందన లభిస్తుంది. ఆగస్టు నెల కోటాలో అదనంగా రోజుకు 3వేల టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేసింది టీటీడీ. ఇక్ మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.

ఇక తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల పేరుతో మోసగిస్తున్న దళారులపై ఫిర్యాదులు అందుతున్నట్లు టీటీడీ చెబుతుంది. రూ.300 టికెట్లు బుక్ చేస్తామని మోసం చేస్తూ కొంతమంది తిరుమలలో తిరుగుతున్నట్లుగా కూడా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. టికెట్లు ఇస్తామని మోసం చేసినవారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. భక్తులు tirupatibalaji.ap.gov.in ద్వారా మాత్రమే టికెట్లు తీసుకోవాలని టీటీడీ సూచించింది. ఫేక్ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles