కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల తిరుపతి భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్తను అందించింది. అందులోనూ శ్రీవారిని ప్రత్యేక దర్శనం ద్వారా వీక్షించాలని ఆశపడే భక్తుల కోసం కొంత వెసలుబాటు కల్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్ లైన్ టికెట్లు హాట్ కేకుల్లా అయిపోతున్న పరిస్థితిపై దృష్టిసారించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. భక్తుల నుంచి వస్తున్న వినతులను పరిగణలోకి తీసుకుని శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను మరిన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఆగస్ట్ నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇదివరకే ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచంగా అవి కేవలం గంటల వ్యవధిలోనే బుక్ అయ్యాయి. దీంతో టీటీడీ బోర్డుకు భక్తుల నుంచి విన్నతులు వెళ్లాయి. తాము ఎంతగానో వేచి చూస్తున్నప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకునేలోపునే అయిపోయాయని.. దయచేసి ఈ సంఖ్యను పెంచాలని భక్తులు కోరారు. ఇక దీనితో పాటు ప్రత్యేక ధర్శన టికెట్లకు భక్తుల నుంచి లభిస్తున్న విశేష స్పందన నేపథ్యంలోనూ టీటీడీ చక్కటి నిర్ణయం తీసుకుంది. ఇదివరకు విడుదల చేసిన కోటాకు అదనంగా మళ్లో కోటాను విడుదల చేశారు.
ఈ అదనపు ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటల నుంచి టీటీడీ వెబ్ సైట్ లో టిక్కెట్లను అందుబాటులో ఉంచింది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు అదనంగా రోజుకు మూడు వేల టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేసింది. శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను అదనంగా అందించి భక్తులకు శుభవార్తను చెప్పగా వాటికి కూడా విశేష స్పందన లభిస్తుంది. ఆగస్టు నెల కోటాలో అదనంగా రోజుకు 3వేల టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేసింది టీటీడీ. ఇక్ మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
ఇక తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల పేరుతో మోసగిస్తున్న దళారులపై ఫిర్యాదులు అందుతున్నట్లు టీటీడీ చెబుతుంది. రూ.300 టికెట్లు బుక్ చేస్తామని మోసం చేస్తూ కొంతమంది తిరుమలలో తిరుగుతున్నట్లుగా కూడా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. టికెట్లు ఇస్తామని మోసం చేసినవారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. భక్తులు tirupatibalaji.ap.gov.in ద్వారా మాత్రమే టికెట్లు తీసుకోవాలని టీటీడీ సూచించింది. ఫేక్ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more