దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే మూడో దశ కేసులు అక్కడక్కడా నమోదు కావడం.. అది మరింత వేగంగా.. మరింత తీవ్రంగా వుంటుందన్న వార్తల నేపథ్యంలో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో కరోనా రెండో ధశ కేసులు కూడా తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుడం అందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు రికవరీ కంటే కొత్త కేసుల నమోదు ఎక్కవగా వుండటంతో అటు కేంద్ర అరోగ్యశాఖ తో పాటు ఇటు రాష్ట్రాలు కూడా అందోళన వ్యక్తం చేస్తున్నాయి, దీంతో దేశ ప్రజలు కూడా తీవ్ర అందోళన చెందుతున్నారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో తాజాగా 45,892 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రితం రోజుతో పోల్చితే 5 శాతం పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3,07,09,557కి చేరాయి. మహారాష్ట్రలోనే అత్యధికంగా 9500పైచిలుకు కేసులు నమోదు కాగా, ఆ తరువాత కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి, కాగా క్రితం రోజలు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడిన 817 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో సంభవించిన మరణాల సంఖ్య 4,05,028కు చేరింది. క్రితం రోజున 18,93,800 మంది నమూనాలు సేకరించి, నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
దేశంలో 55 రోజుల తరువాత మళ్లీ కోత్త కేసుల నమోదు అధికంగా నమోదు కావడం కూడా అందోళనకు కారణమవుతోంది. కరోనా రెండోదశలో గత 55 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. కానీ, తాజాగా 44 వేల మంది కోలుకోగా.. 45 వేల కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం రికవరీలు 2.98 కోట్ల మార్కును దాటాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 1.50శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.18 శాతానికి పెరిగింది. 4.6లక్షల మంది కొవిడ్తో బాధపడుతున్నారు. మరోపక్క నిన్న 33,81,671 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 36.48 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. ఇదిలావుండగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఏకంగా నలభై లక్షల మంది కరోనా మహమ్మారి బారిన పడి అసువులు బాసారు,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more