పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోల్కతా హైకోర్టు షాక్ ఇచ్చింది. అమె హైకోర్టు న్యాయమూర్తిపై చేసిన అరోపణలకు గాను రాష్ట్రోన్నత న్యాయస్థానం ముఖ్యమంత్రికి రూ. 5 లక్షల జరిమానా విధించారు. నందిగ్రామ్ ఎన్నికల పిటీషన్ ను విచారణ నేపథ్యంలో భాగంగా ఈ మేరకు అదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి జస్టిస్ కౌశిక్ చందా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై అరోపణలు వచ్చిన నేపథ్యంలో తాను ఈ కేసు విచారణ నుంచి వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నానని తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి గెలుపును సవాల్ చేస్తూ మమతా బెనర్జీ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ కేసును జడ్జి కౌశిక్ తప్పుకోవాలని మమతా కోరారు. దీంతో ఆ కేసుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ కేసును విడిచిపెట్టే ముందు ఆయన మమతా బెనర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్దమైన విధులను ఆమె ఉల్లంఘించినట్లు జడ్జి పేర్కొన్నారు. జస్టిస్ చందాకు బీజేపీ నేతతో లింకులు ఉన్నాయని, అందుకే తన కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలని మమతా బెనర్జీ కోరారు. కోల్కతా హైకోర్టు న్యాయమూర్తికి రాసిన లేఖలో ఆమె ఈ అభ్యర్థన చేశారు.
ఈ కేసును తన బెంచి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమూర్తి వ్యవస్థకు కళంకం తీసుకువచ్చేలా అరోపణలు చేయడం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందస్తు ప్రణాళికలో భాగంగా చె్ప్పుకోచ్చారు. తనకు బీజేపితో సంబంధాలు వున్నాయన్న అనుమానాల నేపథ్యంలో కేసు విచారణ ట్రయల్ పిరీయడ్ అంతా ఇలాగే నడిపించలేమని చెప్పారు. ట్రయల్ పిరీయడ్ మొత్తం పూర్తిగా ఇలాంటి వారు ఈ తరహా అరోపణలు చేస్తూ.. వారు చేసిన అరోపణలను సజీవంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తారని అన్నారు. దీని ప్రభావం కేసు విచారణతో పాటు న్యాయమూర్తి కుర్చికి, న్యాయవ్యవస్థలకు అపవాదం తీసుకువస్తుందని న్యాయమూర్తి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more