అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్లు వున్న ఈ సమాజంలో.. ప్రేమించిన అమ్మాయినే ఘనంగా పెళ్లి చేసుకుంటున్న ఓ వరుడ్ని పెళ్లి వేదికపైనే ఓ మహిళ చెప్పుతో కొట్టింది. అదేంటి అంటూ నిర్ఘాంతపోతున్నారా.? అమె ఎవరో కాదు వరుడి తల్లే. కన్న కొడుకు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటున్నాడని ఓ తల్లే తన కొడుకును పెళ్లి పీటలమీదే చెప్పుతో కొట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో చర్చనీయాంశంగా మారింది.
హమీర్పూర్ జిల్లాలోని భరువాసుమేర్పూర్ లోని శివానీ ప్యాలెస్ లో ఉంటున్న ఉమేష్ చంద్ర అనే వ్యక్తి తన పొరుగింటిలో ఉండే అంకితా గౌతమ్ అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ వెళ్లి రిజిష్టర్ మ్యారేజి చేసుకుని వచ్చారు. కొడుకు కులాంతర వివాహాం చేసుకోవటం ఉమేష్ చంద్ర తల్లితండ్రులకు నచ్చలేదు. కానీ అంకితా గౌతమ్ తండ్రి వీరి పెళ్లిని అంగీకరించాడు. తిరిగి తన కుమార్తెకు ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం హమీర్ పూర్ లోని ఒక గెస్ట్ హౌస్ లో ఏర్పాట్లు చేశాడు. పెళ్లికి తన వైపు బంధువులను అందరినీ పిలిచినప్పటికీ ఉమేష్చంద్ర తల్లితండ్రులను, కుటుంబసభ్యులను పిలవలేదు.
వివాహ కార్యక్రమం మొదలయ్యింది. వధూవరులిద్దరూ దండలు మార్చుకునే కార్యక్రమం జరుగుతుండగా వరుని తల్లి ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి వస్త్రం కప్పుకుని ఫోటో గ్రాఫర్లను నెట్టుకుంటూ వేదిక మీదకు వచ్చింది. వధూవరులు దండలు మార్చుకోగానే ఆమె తన చెప్పుతో కొడుకును కొట్టింది. ఇది గమనించిన వధువు బంధువులు ఆమెను వెంటనే స్టేజి మీదనుంచి కిందకు దించి పంపించి వేశారు. కొడుకు కులాంతరవివాహం చేసుకున్నాడనే కారణంతోనే ఈ పని చేసినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more