గ్రీన్ పాస్ పోర్ట్ స్కీమ్ కింద ఈయూ దేశాల ప్రయాణ ఆంక్షలను సడలించినప్పటికీ, ఇండియాలో తయారవుతున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను తీసుకున్న వారిని మాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంపై కేంద్రం సుత్తిమెత్తాగా హెచ్చరికలు జారీ చేయడంతో యూరోపిన్ యూనియన్ దిగివచ్చింది. భారతీయులను కూడా యూరప్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతించాలని కోరుతూనే.. అలా కానీ పక్షంలో ఈయూ దేశాలు జారీ చేసే వ్యాక్సిన్ సర్టిఫికెట్లను తాము అంగీకరించబోమని, వారిని కూడా తప్పనసరి క్యారంటైన్ కు తరలిస్తామని తేల్చిచెప్పింది. దీంతో భారత్ తో పెట్టుకోవడం ఇష్టం లేని ఈయూ దేశాలు ఓ మెట్టు దిగివచ్చాయి.
అయితే భారత్ హెచ్చరికల నేపథ్యంలో కోవాగ్జిన్ టీకాను గుర్తించని ఈయూ దేశాలు కోవిషీల్డ్ వాక్సీన్ తీసుకున్న వారికి మాత్రం పర్యటించేందుకు అనుమతించాయి. ఏడు యురోపియన్ యూనియన్ దేశాలు. ఆస్ట్రియా, జర్మనీ, స్లొవేనియా, గ్రీస్, ఐస్లాండ్, ఐర్లాండ్, స్పెయిన్ దేశాలు సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ కు గ్రీన్సిగ్నల్ ఇచ్చాయి. అటు స్విట్జర్లాండ్ కూడా కొవిషీల్డ్ వేసుకున్న ప్రయాణికులను అనుమతించాలని నిర్ణయించింది. ఇండియాలో సీరమ్ తయారు చేస్తున్న కొవిషీల్డ్ యూరోపియన్ దేశాల్లో ఇస్తున్న అస్ట్రాజెనికా వాక్సీన్ ఒక్కటే కావడంతో ఇందుకు అనుమతిస్తున్నట్లు తెలిసింది.
ఇక ఫైజర్-బయోఎన్ టెక్ సారధ్యంలో రూపోందిన కోవాగ్జిన్ ను భారత్ బయోటెక్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ కోవాగ్జిన్ మాత్రం ఈయూ ఇప్పటికీ గుర్తించలేదు. యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఇప్పటి వరకూ ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకాకు చెందిన వ్యాక్స్జెర్వ్రియా, జాన్సన్ అండ్ జాన్సన్కు చెందిన జాన్సెన్ వ్యాక్సిన్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అంటే ఈ నాలుగు రకాల వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్లకు మాత్రమే ఈయూలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక తాజాగా కోవీషీల్డ్ ను కూడా గుర్తించడంతో ఇది ఈయూ గుర్తించిన ఐదవ టీకాగా ఎంపికైంది. భారత్ హెచ్చరికల నేపథ్యంలో ఈయూలోని ఏడు దేశాలు ప్రస్తుతానికి దిగి వచ్చాయి. మిగతా దేశాల విషయంలో ఇంకా స్పష్టత లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more