కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశప్రగతిలో భాగమైన వలస కార్మికుల భవిష్యత్తు. వారి సంక్షేమం ఎవరికీ పట్టడం లేదని అక్షేపించింది. దేశంలో ఇకపై ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ పథకాన్ని 2021 జూలై 31వ తేదీలోగా దేశంలోని అన్నీ రాష్ట్రాలు అమలు చెయ్యాలంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ పథకం కింద వలస కార్మికులకు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా రేషన్ తీసుకునే సౌకర్యం కల్పించాలి ప్రభుత్వాలు. వలస కార్మికుల ప్రయోజనం మరియు సంక్షేమం కోసం సుప్రీంకోర్టు ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
కరోనా కారణంగా వలస కార్మికుల సంక్షేమానికి సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. వలస కార్మికులకు పొడి రేషన్ అందించాలని, మహమ్మారి కొనసాగే వరకు వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్లను కూడా అందుబాటులోకి తీసుకుని రావాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అదే సమయంలో, అసంఘటిత రంగంలో కార్మికుల నమోదును నేషనల్ డేటా గ్రిడ్ పోర్టల్లో నమోదు చెయ్యాలని, ఈ పనిని జూలై 31 లోగా పూర్తి చేయాలని కోర్టు తెలిపింది. దీనికోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సహకారాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో విధించిన ఆంక్షల వల్ల తీవ్రంగా నష్టపోయిన వలస కార్మికులకు ఆహార భద్రత, నగదు బదిలీ మరియు ఇతర సంక్షేమ చర్యలను నిర్ధారించాలని కేంద్రానికి, రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది సుప్రీంకోర్టు. గతేడాది మేలో వలస కార్మికుల సమస్యలు, కష్టాలను ఉన్నత న్యాయస్థానం గుర్తించి పలు ఆదేశాలు జారీచేసింది. వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం, రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను ధర్మాసనం కోరింది. తద్వారా వలస కార్మికులు ఇతర రాష్ట్రాల్లో పనిచేసే ప్రదేశాలలో రేషన్ పొందే అవకాశం ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more