దేశంలో కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు ఉన్న ఏకైక మార్గం టీకాయేనని చెబుతున్న ప్రభుత్వం.. గత సోమవారం నుంచి వ్యాక్సిన్ విధానంలో సవరణను తీసుకువచ్చింది. ఇకపై దేశంలోని 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతీఒక్కరు.. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా వాక్సీన్ తీసుకోవచ్చునని అదేశాలు జారీచేసింది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తొలి రోజు రికార్డు స్థాయిలో జరిగిన టీకా పంపిణీ సుమారుగా కోటి మేర ప్రజానికానికి వాక్సీన్ ఇచ్చింది. ఆ మరుసటి రోజు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం చర్యలను తూర్పారబట్టాయి.
ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ ఉంటే.. ఇలాంటి ఆశ్చర్యాలు సాధ్యమేనని ఎద్దేవా చేసిన ఆయన.. బహుశా దీనికి నోబెల్ బహుమతి కూడా ఇస్తారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ డోసులు అందజేసేలా.. సవరించిన మార్గదర్శకాలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో సోమవారం దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 88లక్షలకు టీకాలు వేశారు.
అయితే, మంగళవారం మాత్రం 54లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ గణాంకాలపై చిదంబరం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ఆదివారం కూడబెట్టి.. సోమవారం వ్యాక్సిన్ వేసి.. మంగళవారం తిరిగి ఎప్పటిలాంటి ఇబ్బందుల్లోకి రావడం - వ్యాక్సినేషన్లో ‘ప్రపంచ రికార్డు’ వెనుక రహస్యమిదే. ఈ ‘ఫీట్’కు కచ్చితంగా గిన్నిస్బుక్లో చోటు లభిస్తుందనిపిస్తోంది. ఎవరికి తెలుసు.. బహుశా మోదీ ప్రభుత్వానికి వైద్యశాస్త్రంలో నోబెల్ బుహుమతి కూడా ఇవ్వొచ్చు. ‘మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే’ అనేదాన్ని ఇప్పుడు ‘మోదీ ఉంటే అద్భుతాలే’ అనాలేమో.!!’’ అంటూ ఆయన విమర్శల వర్షం కురిపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more