భారతదేశం చైనాను కూడా అధిగమించి దూసేకెళ్లేలా దేశజనాభా తయారవుతుందన్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణపై దృష్టి సాగిస్తున్నాయి. ఈ క్రమంలో మిజోరం రాష్ట్ర మంత్రి మాత్రం ఆసక్తికర ప్రకటన చేశారు. జనాభా నియంత్రణకు బదులుగా అధిక జనాభాను ప్రోత్సహించేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అధిక సంతానం కలిగిన తల్లిదండ్రులకు బహుమానం కూడా ఇస్తానని ప్రకటన చేయడం గమనార్హం. ఔనా, నిజమేనా అంటారా.. ఇది ముమ్మాటికీ నిజం. అయితే అందుకు ఓ కారణం కూడా వుందని పేర్కోంటున్నారు ఈ అమాత్యులు.
అయితే ఈ బహుమతి అందరికీ అనుకునేరు. మిజోరం వాసులకు కూడా కాదు. కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అంటున్నారు. తన అసెంబ్లీస్థానం పరిధిలో అత్యధిక సంతానం ఉన్న తల్లిదండ్రులకు రూ.లక్ష నగదు బహుమతి అందిస్తానని ప్రకటించారు. అయితే అందుకు కారణాన్ని కూడా చెప్పారాయన. మిజో తెగల్లో జనాభాను పెంచేందుకు తాను ఈ ఆఫర్ ప్రకటించినట్లు మిజోరం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రొమావియా వెల్లడించారు. ఫాదర్స్ డే సందర్భంగా ఈ తరహా ప్రకటన చేసిన ఆయన తన నియోజకవర్గం ఐజ్వాల్ తూర్పు-2 పరిధిలో అత్యధిక సంతానం ఉన్న తల్లీ లేదా తండ్రికి రూ. లక్ష నగదు ప్రోత్సాహకం అందిస్తానని, దానితో పాటు ట్రోఫిని కూడా అందజేస్తామని వెల్లడించారు.
అయితే అత్యధికంగా ఎంతమంది సంతానం కలిగి వుండాలన్నది మాత్రం మంత్రి స్పష్టంగా చెప్పలేదు. ఈ తరహా ప్రకటనను వెలువరించినడానికి మిజో వర్గంలో రానురాను తగ్గుతున్న జనాభాయే కారణమని చెప్పారు. కొన్ని రంగాల్లో నిష్టాతుతైన ఈ వర్గం తగ్గదలతో ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించలేకపోతున్నామని చెప్పారు, మిజో లాంటి గిరిజన తెగలకు ఇది సమస్యగా తయారవుతోంది. అందుకే ఈ తెగల్లో జనాభాను పెంచేందుకు ఈ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించినట్లు మంత్రి రాబర్ట్ రొమావియా తెలిపారు. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం మిజోరం జనాభా 10,91,014. దేశంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన రెండో రాష్ట్రం మిజోరం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more