టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. పలు బ్యాంకుల నుంచి ప్రజాధనాన్ని రుణాలుగా పోందిన ఆయన వాటిని తిరిగి చెల్లించడంలో విఫలం అయ్యారు. బ్యాంకులకు మరో ఎగవేతదారుగా మారిని నామా నాగేశ్వరరావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాల్సిందిగా నామాకు అందజేసిన సమన్లలో పేర్కోన్నారు. బ్యాంకు రుణాలను అక్రమంగా విదేశీ కంపెనీలకు మళ్లించారనే అభియోగాలపై నామాకు ఈడీ సమన్లు పంపింది. మదుకాన్ కేసులో నామా నాగేశ్వరరావుతో పాటు నిందితులందరికి సమన్లు జారీచేసింది.
ఇప్పటికే ఖమ్మం, హైదరాబాద్ సహా మొత్తం 6 చోట్ల సోదాలు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత వారంలో ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు ఆ తరువాత మధుకాన్ డైరెక్టర్ల ఇళ్లల్లో కూడా సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. మదుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఇటీవలే రెండు రోజుల పాటు సోదాలు జరిగాయి. ఈడీ సోదాల్లో భారీగా దస్త్రాలు, లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. అలాగే అకౌంట్లు, హార్డ్ డిస్కులను ఈడీ బృందాలు విశ్లేషిస్తున్నాయి.
బ్యాంకు రుణాలను మళ్లించిన కేసులో నామా నాగేశ్వరరావుకు సమన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మధుకాన్ కేసులో ఉన్న నిందితులందరికీ ఈడీ సమన్లు జారీ చేసింది. మూడు రోజుల క్రితమే నామా నివాసాలు, ఆఫీస్, మధుకాన్ కాంపెనీ, డైరెక్టర్ల ఇళ్లల్లో 20 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కంప్యూటర్లు, బ్యాంక్ లావాదేవీలు, కీలక డాక్యమెంట్లకు సంబంధించి కీలక ఆధారాలను ఈడీ సేకరించింది. నగదు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు అనంతరం విచారణకు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని ఈడీ నోటీసులో పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more