ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా పాలనా రాజధాని విశాఖలో పెట్టే పనులను ముమ్మరం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హస్తిన పర్యటన విజయవంతంగా ముగిసిన వెంటనే ఆయన అడుగులు మూడు రాజధానుల వైపు పడుతున్నాయి. ఇక ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మూడు రాజధానుల అంశంపై చర్చ జరగగా గ్రీన్ సిగ్నల్ లభించిన్నటు వార్తలు వెలువడుతున్నాయి. వైసీపీ కీలక నేతల వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే మూడు రాజధానుల పాలన అమల్లోకి వచ్చేట్టు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు కేంద్ర మంత్రులతో పాటు కేంద్రంలోని పెద్దల నుంచి కూడా పచ్చజెండా లభించినట్టేనన్న సంకేతాలను వెలువర్చుతూ.. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుగా దిశగా కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి. త్వరలో విశాఖ పాలనా రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్ గా వెంటనే అమల్లోకి తీసుకుని రావాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం చట్టం కూడా చేయగా.. కేంద్రం ప్రభుత్వం నుంచి పాలన అనుమతులు రావాల్సి ఉంది. జగన్ ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతో ఈఅంశంపైనే చర్చ జరిగింది.
ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. త్వరలో పాలనా అనుమతులు వస్తాయని చెప్పడంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అవుతుందని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. అధికార వికేంద్రీకరణ చేయడం ఖాయమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. త్వరలోనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని, మూడు రాజధానుల నిర్ణయం పంతానికి చేసింది కాదన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు. జగన్ పర్యటన వ్యక్తిగతం కాదని, రాష్ట్ర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగిందని అన్నారు. శాసనమండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దానిని రద్దు చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సజ్జల పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more