ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. బతికి ఉన్న తన భార్యకు దహన సంస్కారాలతో పాటు దశదిన కర్మలు కూడా చేయించిన తరువాత అమె సజీవంగా కళ్లముందుకు వస్తే.. ఆ భర్త పడే బాధ వర్ణణాతీతం. అదీకాక.. ఎవరో శవానికి తాను దహనసంస్కారాలు చేశానని, తమ బంధువులకు అమె కడసారి చూపు కూడా దక్కనీయకుండా చేశానన్న మనోవేధన ఆతడ్ని కంగదీస్తుంది. రెక్కడితే కానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన వ్యక్తి తన భార్య అంతక్రియలు, దశదిన కర్మ చేసేందుకు కూడా అప్పు చేయాల్సి వచ్చింది. మరీ ఆ డబ్బు ఎవరు తీరుస్తారన్నది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.
వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని క్రిస్టియన్ పేటకు చెందిన గిరిజమ్మ అనే మహిళ కరోనా కారణంగా విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆమెకు అడ్మిట్ చేసుకున్న వైద్యులు.. చికిత్సను అందించారు. కాగా గిరిజమ్మ చనిపోయారంటూ మే 15న ఓ మృతదేహాన్ని ఆమె భర్తకు వైద్యులు అప్పగించారు. దీంతో చేసేది లేక బాధాతప్త హృదయంతో ఆమెకు తన భర్త అయిన గడ్డయ్య అంత్యక్రియలను నిర్వహించారు. ఇదిలావుండగానే కరోనా కారణంగా ఖమ్మం జిల్లాలోని అసుపత్రిలో చేరిన అమె కుమారుడు రమేశ్ కూడా మే 23న మృతి చెందాడు. వారం వ్యవదిలో ఒకే ఇంట్లో ఇద్దరు మృత్యువాత పడటంతో గడ్డయ్య పరిస్థితి దీనంగా మారింది.
రెండు రోజుల క్రితమే తల్లి, కొడుకుకి కుటుంబసభ్యులు దశదినకర్మలను పూర్తి చేశారు. అయితే, ఈరోజు వారికి ఊహించని ఘటన ఎదురైంది. గిరిజమ్మ జగ్గయ్యపేటలోని తన ఇంటికి వచ్చింది. దీంతో అంతా షాక్ కు గురయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బందిపై కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు చనిపోయారో కూడా నిర్ధారించుకోకుండానే మరొకరి మృతదేహాన్ని ఎలా అప్పగిస్తారని ఆమె భర్త గడ్డయ్య మండిపడ్డారు. మరోవైపు గిరిజమ్మ రావడం కుటుంబసభ్యులకు సంతోషం కలిగించినప్పటికీ... కొడుకుని కోల్పోవడంతో గడ్డయ్య దంపతులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఓవైపు ఆనందం, మరోవైపు విషాదం ఆ ఇంటిలో నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more