లాక్ డౌన్ అనగానే వైన్ షాపుల ముందు జనం ఎంతలా బారులు తీరుతారో మనకు తెలుగు రాష్ట్రాల ప్రజలను చూస్తేనే అర్థం అవుతుంది. ఎందుకంటే గత ఏడాది మద్యం దుకాణాలు తెరచి తెరువగానే ఎంతటి క్యూ మద్యం దుకాణాల మందు వుందో మనం మీడియాలో, పత్రికలలో చూశాం. ఇక సరిగ్గా ఈ సారి మే నెలలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ అనగానే అనేక మంది మద్యం దుకాణాల వద్ద క్యూ కట్టారు. అయితే ఈ పరిస్థితి ఇక్కడే కాదు ఏ రాష్ట్రమందు చూసినా మద్యం బాబులు రూటు వైన్ షాపుల వైపు అనక తప్పదు. మద్యానికి గిరాకీ అలాంటిది మరీ.
ఇక ఇప్పటికే కరోనా కేసులతో అల్లాడిపోతూ అంతకంతకూ పెరుగుతున్న కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకున్న ఢిల్లీ ప్రభుత్వం కూడా కరోనా సంఖ్య పెరగడానికి ఒక్క కారణంగా మారిన మద్యం దుకాణాలపై దృష్టిసారించింది. దీంతో ఇక మధ్యాన్ని హోం డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మద్యం డోర్ డెలివరీకి అక్కడ అనుమతులున్నా.. దానికి పరిమితులున్నాయి. ఈమెయిల్ ద్వారా ఆర్డర్ పెడితేనే మద్యం ఇంటికి వచ్చేది. అది కూడా స్పెషల్ లైసెన్స్ ఉన్న షాపులకే ఆన్ లైన్ మద్యం డెలివరీకి అనుమతి ఉండేది. కానీ, ఇప్పుడు లాక్ డౌన్ వల్ల జనం వైన్స్ ముందు క్యూలు కట్టడం, గుంపులుగా చేరుతుండడంతో ఫోన్ నుంచి ఆర్డర్ పెట్టినా ఇంటికి మద్యాన్ని డెలివరీ చేసేందుకు ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ ఎక్సైజ్ (సవరణ) చట్టం 2021 ప్రకారం.. ఎల్ 14 లైసెన్స్ లు ఉన్న అన్ని మద్యం షాపులూ ఇంటికి మద్యం డెలివరీ చేసేందుకు అనుమతులను ఇచ్చింది. మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా ప్రజలు ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టేందుకు అవకాశం ఇచ్చింది. వాస్తవానికి గత ఏడాది లాక్ డౌన్ విధించగానే మద్యం షాపుల ముందు జనం భారీగా గుమిగూడారు. దీంతో డోర్ డెలివరీ చేసే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ఢిల్లీ సర్కార్ కు సుప్రీం కోర్టు సూచించింది. అప్పుడే ఈ మెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా ఆర్డర్ చేస్తే ఎల్ 13 లైసెన్స్ కలిగి ఉన్న షాపులు డోర్ డెలివరీ చేసేందుకు ఓకే చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more