దేశసర్వోన్నత న్యాయస్థానంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. మీడియా సంస్థలపై రాజద్రోహం కింద కేసులు నమోదు చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని, పరిమితులను పునర్విచారించాల్సిన అవసం వుందని అభిప్రాయపడింది. ఈ కేసు తదుపరి విచారణ వరకు మీడియా సంస్థలపై కానీ, సంస్థ ప్రతినిధులపై కాని ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని న్యాయస్థాన ధర్మాసనం స్పష్టం చేసింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసును నమోదు చేసిన ఏపీ సీఐడీ, అదే సమయంలో ఆయన మీడియా సమావేశాలను ప్రసారం చేసిన రెండు మీడియా ఛానెళ్లపై కూడా ఏసీబి రాజద్రోహం కింద కేసులు నమోదు చేసింది.
దీంతో ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కింద తమపై ఏసీబితో కేసులు నమోదు చేయంచడాన్ని సవాలు చేసిన తెలుగు వార్తా ఛానళ్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5లు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్ ను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ బెంచ్ లో జస్టిస్ చంద్రచూడ్ తో పాటు... జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ ఉన్నారు. కేసు విచారణ సందర్భంగా మీడియా సంస్థలపై రాజద్రోహం కింద కేసులు నమోదు చేయడంపై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఈ తరహాలో కేసులు నమోదు చేయడం మీడియా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నంలా (muzzle media freedom) ఉందని వ్యాఖ్యానించింది. దేశద్రోహం చట్టానికి సంబంధించిన పరిమితులను పునర్నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైందని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రెండు ఛానళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని విచారణ సందర్భంగా ఛానళ్ల తరపు న్యాయవాదులు సుప్రీంను కోరారు. దీంతో, ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ... తదుపరి విచారణ వరకు ఈ రెండు ఛానళ్లపై కానీ, వాటి సిబ్బందిపై కానీ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. ప్రతి రాష్ట్రం దేశద్రోహం కేసును దుర్వినియోగం చేస్తోందని... ఈ అంశాన్ని తాము చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని తెలిపింది. రాజద్రోహం కేసుల నమోదుపై తాము పూర్థి స్థాయిలో దృష్టి సారిస్తామని చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more