కరోనా మహమ్మారి పంజా విసురుతున్న తరుణంలో జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టి ప్రభుత్వం తక్షణం తమ డిమాండ్లను పరిస్కరించాల్సిందిగా కోరడంతో ప్రభుత్వ కూడా దిగివచ్చింది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సమ్మెలోకి వెళ్లిన జూనియర్ డాక్టర్లు.. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 10న రాష్ర్ట వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డికి సమ్మె నోటీసు ఇచ్చమని తమ డిమాండ్ల పరిష్కారానికి మరో మార్గం లేక కరోనా నేపథ్యంలోనే సమ్మనోటీసు ఇవ్వక తప్పడం లేదని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు.
అయితే యావత్ ప్రపంచమంతా కరోనా మహమ్మారి గురించి అలోచించి పరిశోదనలు చేస్తూ, రోగులకు చికిత్స అందిస్తున్న కష్టకాలంలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునివ్వడం సముచితం కాదని, వెంటనే విధుల్లో చేరాలని మంత్రి కేటీఆర్ వారికి సూచించినా జూనియర్ డాక్టర్లు పట్టించుకోలేదు. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు జూనియర్ డాక్టర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాయి, దీంతో ఆయన సంబంధిత వైద్యాధికారులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితుల్లో జుడాలు సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని… తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు.
జూనియర్ డాక్టర్లపై ఏనాడు ప్రభుత్వం వివక్ష చూపలేదన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తూనే ఉందని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.ఈ సందర్భంగా వారి సమస్యలపై ఆరా తీశారు. తక్షణమే జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం 15 శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ వైద్య సేవల్లో కొనసాగుతున్న వైద్య విద్యార్థులకు కూడా…సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనం అందించాలని సూచించారు. జుడాలు, వారి కుటుంబీలకు నిమ్స్ లో మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. నిబంధనల మేరకు ఎక్స్ గ్రేషియా కూడ సత్వరమే అందించాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more