కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతోంది. దేశాల అర్థిక పరిస్థితులనే తలక్రిందులు చేసేలా పంజా విసిరిన ఈ మహమ్మారి ధాటికి గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్ డౌన్ ఫ్రకటించాయి. అయితే ఈ ఏడాది భారత్ లో కరోనా మహమ్మారి రెండో దశ దెబ్బ తీవ్రంగా వుంది. గత ఏడాది సకాలంలో లాక్ డౌన్ విధించడంతో తగ్గిన మరణాలు.. ఈ ఏడాది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలేయడంతో దాదాపుగా కరోనా మహమ్మారి జడలు విప్పిన తరువాత కానీ రాష్ట్రాలు లాక్ డౌన్ పై దృష్టి సారించలేదు. దీంతో అనేక కుటుంబాలు తమ కుటుంబ సభ్యులను కోల్పోయాయి.
అయితే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం అనాధలైన పిల్లలకు, ఆర్జించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలుస్తామని ప్రకటించాయి. అయితే ఇప్పటి వరకు దేశంలో ఏ సంస్థ, పరిశ్రమ ప్రకటించని విధంగా టాటా స్టీల్ మాత్రం తమ పెద్ద మనసును కనబర్చింది. ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలుపుతూ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ప్రకటించింది. కంపెనీ అనౌన్స్ చేసిన స్కీమ్ ప్రకారం.. ఉద్యోగులెవరైనా కొవిడ్ తో చనిపోతే వారు పదవీ విరమణ పోందే వరకు ఆ కుటుంబానికి వేతనాన్ని అందిస్తామని తెలిపింది.
అంతేకాకుండా బతికి ఉండగా అందించిన మెడికల్ బెనిఫిట్స్, హౌజింగ్ ఫెసిలిటీలను కూడా అందిస్తారు. దీంతో పాటుగా ఫ్రంట్ లైన్ ఉద్యోగి కొవిడ్ ఇన్ఫెక్షన్ కు గురై ఉద్యోగం కోల్పోయి చనిపోతే వారి పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను గ్రాడ్యుయేషన్ వరకూ మొత్తం సంస్థనే భరిస్తుంది. ‘టాటా స్టీల్ అగిలిటీ విత్ కేర్’ (#AgilityWithCare) అనే పేరుతో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ను ఉద్యోగి కుటుంబ సభ్యులకు అందజేసేందుకు విస్తరిస్తూ వస్తుంది. తమకు తోచినంత తాము చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గట్లు ఈ క్లిష్ట సమయంలో ఇతరులకు సహాయం చేస్తారని ఆశిస్తున్నామని టాటా స్టీల్ ట్విట్ లో కోరింది. ఈ ప్రకటనతో టాటాస్టీల్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
#TataSteel has taken the path of #AgilityWithCare by extending social security schemes to the family members of the employees affected by #COVID19. While we do our bit, we urge everyone to help others around them in any capacity possible to get through these tough times. pic.twitter.com/AK3TDHyf0H
— Tata Steel (@TataSteelLtd) May 23, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more