సంగం డెయిరీ కేసులో అవకతవకలకు కారణమయ్యారన్న అభియోగాలపై అరెస్టైయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు నెలరోజుల తరువాత విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రోన్నతన్యయాస్థానం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్లకు బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. థూళిపాళ్లతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు సైతం న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత నెల 23న అవినీతి నిరోధకశాఖ అధికారులు ధూళిపాళ్లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
సంగం డైరీలో అవకతవకలు జరిగాయని వాటిపై కేసులు నమోదు చేసిన అవినీతి నిరోదక శాఖ.. ధూళిపాళ్ల నరేంద్రతో పాటు గోపాలకృష్ణన్ కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో నరేంద్రతో పాటు గోపాల్ కృష్ణన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాలుగు నెలల పాటు విజయవాడ మునిసిపల్ పరిధిలోనే ఉండాలని కోర్టు షరతు విధించింది. వారు నివాసముంటున్న స్థలం చిరునామాను విచారణ అధికారికి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, విచారణకు 24 గంటల ముందు విచారణ అధికారి నోటీసు ఇవ్వాలని సూచించింది.
ఇద్దరు వ్యక్తులతో రూ.లక్ష మేర షూరిటీ ఇవ్వాలని న్యాయస్థానం అదేశించిన నేపథ్యంలో ఆయన తరపు న్యాయవాదులు ఆ వ్యవహారాలను పూర్తి చేసే పనిలో వున్నారు. కాగా, ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు నేపథ్యంలో నాలుగు వారాలుగా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఆయన ఇన్ని రోజులు రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. అందులోనే ఆయనకు కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలడంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more