కరోనా వైరస్ మహమ్మారి సెకెండ్ వేవ్ విజృంభన ఇదివరకే పలు విదేశాలలో విలయాన్ని సృష్టించింది. ఇక తాజాగా భారత్ లోనూ రెండో దశ కోరలు చారి అనేకమందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి తాజాగా కాసింత నెమ్మదించింది. అయితే దానిని సాధ్యమైనంత వరకు నియంత్రించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు వాక్సీన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే దీనిపై మరింత అధ్యయనం చేస్తున్న సంస్థలు ఇప్పటికీ వాక్సీన్లు రూపోందించే పనిలో నిమగ్నమయ్యాయి. వీటిలో రష్యాకు చెందిన స్పూట్నిక్ వి, భారత్ కు చెందిన కోవిషీల్డ్, కోవాగ్జిన్, అమెరికా బయో ఎన్ టెక్, ఆస్ట్రాజెనికా సంస్థలు రూపోందించిన ఫైజర్ సహా పలు వాక్సీన్లు ఇప్పటికే ప్రజలు తీసుకుంటున్నారు.
ఇక వీటికి తోడు జాన్సన్ అండ్ జాన్సన్ సహా పలు సంస్థలు పరిశోధనలు ముగించి ట్రయల్స్ కొనసాగిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ఫ్రాన్స్ సంస్థ సనోఫి, బ్రిటన్ దిగ్గజ సంస్థ గ్లాక్సో స్మిత్ క్లైన్ (జీఎస్కే) సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మంచి ఫలితాలనిస్తోంది. ఈ మేరకు ఇవాళ ఆయా సంస్థలు సంయుక్తంగా టీకా పనితీరుపై ప్రకటన జారీ చేశాయి. ఆ ట్రయల్స్ లో కరోనాను నిరోధించే ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) భారీగా ఉత్పత్తయ్యాయని కంపెనీలు ప్రకటించాయి. 722 మందిపై ట్రయల్స్ చేశామని, పెద్ద వారిలో మంచి ఫలితాలు కనిపించాయని చెప్పాయి. గత ఏడాది కొన్ని అనివార్య కారణాలతో వారి వ్యాక్సిన్ పరిశోధనకు బ్రేకులు పడగా.. మళ్లీ వెంటనే తేరుకుని రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాయి.
ఈ ఫలితాలిచ్చిన ఉత్సాహంతో రాబోయే కొన్ని రోజుల్లో మూడో దశ ట్రయల్స్ కు సన్నాహాలను భారీగా చేసునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించాయి. తమ కరోనాపై వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ప్రతిరక్షకాలు ఉత్పత్తి జరగడంతో పాటు అవి బాగా పనిచేస్తున్నట్టు రెండో ధశ డేటాలో తేలిందని, మహమ్మారితో పోరులో తమ వ్యాక్సిన్ కూడా కీలక పాత్ర పోషిస్తుందని సనోఫీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ థామస్ ట్రయంఫీ చెప్పారు. వేరియంట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచానికి మరిన్ని వ్యాక్సిన్లు అవసరమని చెప్పారు. సాధారణ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేసుకునే వ్యాక్సిన్లను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more