అరేబియా సముద్రంలో లక్షద్వీస్ వద్ద ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. ఇది క్రమంగా వేగాన్ని పెంచుకుని తుపానుగా, ఆపై పెను తుఫానుగా మారనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం వాయుగుండం కేరళలోని కన్నూర్ ప్రాంతానికి 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తౌక్టేగా నామకరణం చేసిన ఈ తుఫాను అదివారం మరింత తవ్రంగా మారుతుందని, ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరాన్ని దాటే అవకాశముందని వాతవరణ కేంద్రం అధికారులు తెలిపారు. తౌక్టే తుపాను పెను తుపానుగా మారి తీరం దాటే సమయంలో మహా ప్రళయంగా సంభవించనుందని హెచ్చరించింది.
తీరం దాటే సమయంలో గంటకు 150 నుంచి 170 కిలోమీటర్ల వేగంలో ఈదురు గాలులు వీయవచ్చని అప్రమత్తం చేసింది. ‘తౌక్టే’ తుపాను కారణంగా కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఇక తెలంగాణలోనూ తేలికపాటి జల్లులు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయిన వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ధాటికి ఇప్పటికే కొల్లాం జిల్లాలోని అనేక చోట్లు ఈదురుగాలులతో కూడిన వర్షాలకు అనేక చోట్ల చెట్టు నేలకూలయి. వందలాది ఇళ్లు కూడా ద్వంసమయ్యాయి.
ఏకభిగిన కురుస్తున్న వర్షాలతో కొండచరియలు అధికంగా వున్న వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో ప్రాణనష్టం వాటిల్లకుండా జిల్లా అధికారులు రాష్ట్రప్రభుత్వాల అదేశాల మేరకు ముందస్తు చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు నివారణ సంస్థ అధికారులు కూడా ఆయా జిల్లాల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. తుపాను ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు ప్రభావిత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో 53 బృందాలను మోహరించారు, ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్ డీజీ సత్యప్రధాన్ ట్వీట్ చేశారు.
'తౌక్టే' ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో 15, 16 తేదీల్లో తెలంగాణ నైరుతి జిల్లాల్లో అధికంగా వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో శని, ఆదివారల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు నుంచి భారి వర్షాలు పడే అవకాశముందని అన్నారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఈ రెండు రోజులు 3040 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more