కోవిడ్ నుంచి కోలుకుంటున్న, కోలుకున్న రోగుల్లో బ్లాక్ ఫంగస్ సోకడంతో అది అత్యంత ప్రమాదకరంగా మారి ప్రాణాలను హరిస్తున్న నేపథ్యంలో అందోళన వ్యక్తం చేసిన ఎయిమ్స్ డైరెర్టక్ రణ్ దీప్ గులేరియా బ్లాక్ పంగన్ ను అత్యంత సమర్థవంతంగా నియంత్రించాల్సిన అవసరం వుందని అన్నారు. ఇప్పడివరకు బ్లాక్ ఫంగస్ సోకుతున్న వారిలో అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులే అధిక సంఖ్యలో వున్నారని తెలిపారు. దాదాపుగా 90 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు కరోనా నుంచి కోలుకున్న తరుణంలో దీని బారిన పడ్డారని.. దీంతో కోవిడ్ రోగులలో మరీ ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న కోవిడ్ రోగులలో షుగర్ లెవెల్స్ ఎలా వున్నాయన్న పరిశీలించి, నియంత్రించాలని ఆయన సూచించారు.
ఈ మేరకు నిర్వహించిన క్లినికల్ ఎక్సిలెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లాలకు చెందిన క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రోటోకాల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్లాక్ పంగస్ కేసులు వేగంగా పెరగడానికి కారణమైన డేటాను పరిశీలించగా, అందులో మధుమేహంతో బాధపడుతున్న వారిలోనే ఈ ప్రాణాంతక ఫంగస్ అధికంగా వుందని తేలిందని, అందుకు బలమైన స్టెరాయిండ్లు వినియోగించడమే కారణమని కూడా తెలుస్తుందని అన్నారు. ఇక అందులోనే అత్యధికంగా ఈ ప్రాణాంతక ఫంగస్ కేసులు ప్రభుత్వ అసుపత్రుల నుంచే నమోదు అవుతున్నాయన్న విషయం తెలిసిందని అన్నారు, ఈ మేరకు గుజరాత్ వైద్యులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.
స్టెరాయిండ్స్ వాడిన కోవిడ్ రోగులు లింపోపెనియాకు కూడా గురువుతారని.. ఇక దీనికి తోడు ఫవర్ ఫుల్ స్టెరాయిండ్స్ వాడటంతో వారిలో షుగర్ లెవెల్స్ అధికంగా వుంటాయని అన్నారు. ఇక కరోనా తొలిదశలో దాని నుంచి కోలుకున్న రోగులలో మాత్రమే కనిపించిన బ్లాక్ పంగస్.. రెండో దశలో మాత్రం కోవిడ్ బారిన పడిన రోగుల్లోనూ బ్లాక్ పంగస్ కనిపిస్తుందని ఆయన అన్నారు. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో తాము ప్రస్తుతం సరికొత్త సవాళ్లను ఎదుర్కోంటున్నామని అన్నారు. దీంతో స్టెరాయిండ్స్ వినియోగాన్ని మోతాదులోనే వినియోగిస్తూ, మధుమేహాన్ని నియంత్రిస్తూ కరోనా రోగులకు వైద్యం అందించాలని రణ్ దీప్ గులేరియా సూచనలు చేశారు.
దీంతో పాటు కరోనా వేరియంట్లు కొత్తగా పుట్టుకొస్తున్న ప్రస్తుతం తరుణంలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. మాస్కులు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే భౌతిక దూరం సైతం పాటించాలన్నారు. వైరస్ రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు. కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత అన్నది ఇంకా తెలియదన్నారు. అయితే, ఏ వేరియంట్ బారి నుంచైనా మాస్కు, భౌతిక దూరం రక్షిస్తాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more