తనను పిలిచి ట్రస్టు బోర్డు సభ్యురాలిగా పదవిని కట్టబెట్టిన వారే ఇప్పుడు అర్థాంతరంగా తనను పదవిలోంచి తీసి వేసి అవమానించడం ఏంటని.. సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలు దాడి దేవి ప్రశ్నించారు. తనకు కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా.. బోర్డు సభ్యురాలిగా తొలగించడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన దేవి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా కొనసాగుతుండగా ఆమెను అకస్మాత్తుగా తొలగించిన ప్రభుత్వం ఆ స్థానంలో విశాఖకు చెందిన ఆళ్ల భాగ్యలక్ష్మిని నియమించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేవి న్యాయపోరాటానికి సిద్దమయ్యారు. తనకు న్యాయం చేయాలని రాష్ట్రోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తనకు ఏమాత్రం ముందస్తు సమాచారం అందించకుండా పదవిలోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడంపై ఆమె రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. తన పదవీ కాలం ఇంకా వున్నప్పటికీ అర్థాంతరంగా తనను పదవిలోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం తనను అవమానించడమేనని అమె తన హౌజ్ మోషన్ పిటీషన్ లో పేర్కొన్నారు. అమె పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం అమెను పదవిలోంచి తొలగిస్తూ జారీ చేసిన జీవోపై స్టే విధించింది. ఈ జీవో అమలును ఎనమిది వారాలపాటు నిలిపివేసిన న్యాయస్థాన ధర్మాసనం.. అప్పటి వరకు దాడి దేవిని పదవిలోనే కొనసాగించాలని సింహాచల ట్రస్టు బోర్డును అదేశించింది. అకస్మాత్తుగా దాడి దేవిని తొలగించడానికి కారణాలను తెలపాలని బోర్డును అదేశించింది.
దీంతో పాటు దాడి దేవిని పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో విశాఖకు చెందిన ఆళ్ల భాగ్యలక్ష్మిని నియమించడానికి గల కారణం ఏంటని కూడా న్యయాస్థానం ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక కమిషనర్, సింహాచలం దేవస్థానం ఈవోలతో పాటు, ఆళ్ల భాగ్యలక్ష్మికి నోటీసులు జారీ చేసింది. ట్రస్టు బోర్డు నుంచి తనను అకారణంగా తొలగించారంటూ దేవి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీని ఏర్పాటు చేసినప్పటి నుంచి తన భర్త పార్టీ కోసం పనిచేస్తున్నారని అయినప్పటికీ ఎలాంటి పదవులను తాము ఆశించలేదన్నారు. అయితే, పిలిచి మరీ సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా తనకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. మరి అలాంటిది తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎందుకు తొలగించారని ఆమె ప్రశ్నించారు. ఇదెక్కడి అన్యాయం జగనన్నా? అంటూ నిలదీశారు. తనను ఎందుకు తొలగించారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more