ధేశంలో కరోనా వైరస్ రెండో దశ శరవేగంగా విస్తరిస్తూ లక్షలాధి మంది దాని ప్రభావానికి గురవుతున్న వేళ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా విమర్శల జడివాన కురుస్తోంది. అయితే ప్రభుత్వాలు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని ప్రకటనలు చేస్తున్నా వాస్తవానికి కరోనాబారిన పడిన రోగుల పరిస్థితులు ఎంత దారుణంగా వున్నాయో కళ్లకు కట్టినట్టు చూపించే పలు వీడియోలు, ఫోన్ వాయిస్ రికార్డింగులు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే ఇలాంటి హృదయవిదారక ఘటనలు అనేకం జరుగుతున్నా ఎవరిపై చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వాలు వున్నాయి.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తెలంగాణలో మాత్రం అంతా సవ్యంగానే సాగుతోందని ప్రభుత్వం, వైధ్యశాఖ అధికారులు ప్రకటిస్తున్నా.. ఉస్మానియా విద్యార్థి నేత మరణం మాత్రం పలు ప్రశ్నలను తెరపైకి తీసుకువస్తోంది. ఆయన తన భార్యతో జరిపిన చివరి ఫోన్ సంభాషణ తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధానిలోని అసుపత్రుల్లో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. కరోనా మహమ్మారి బారిన పడిన ఉస్మానియా విద్యార్థి సంఘం నేత బెల్లంకొండ కృష్ణా గౌడ్ సోమవారం ఉదయం మరణించాడు. సూర్యపేట జిల్లా మునగాల మండలంలోని నేలమర్రికి చెందిన ఆయన వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించాడని ఆయన భార్య అరోపించారు.
తన భర్త తనతో చివరిగా ఆదివారం రోజు రాత్రి ఫోన్ లో మాట్లాడారని అమె అన్నారు. ఈ మాటలను విన్న అందరి హృదయాలు కదులుతున్నాయి. పది రోజులుగా నిమ్స్ అసుపత్రిలో చికిత్స పోందుతున్నా.. తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, సాచ్యురేషన్ లెవల్స్ తక్కువగా వున్నా తనకు కనీసం అక్సిజన్ పెట్టేలేదని భార్యతో వాపోయాడు. ఆక్సిజన్ పెట్టకపోవడంతో తనకు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా వుందని చెప్పాడు. తనను త్వరగా ప్రైవేటు అసుపత్రికి తీసుకువెళ్తే తప్ప తాను బతకనని చెప్పాడు. ఇప్పటికైతే బతికే వున్నాను కానీ తర్వాతి సంగతి చెప్పలేనని వాపోయాడు. అసుపత్రి వర్గాలు మాత్రం కృష్ణను వెంటిలేటర్ పైనే చికిత్స అందించామని పేర్కొన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more