కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ భీభత్సం తొలి దశ కన్నా భయానకంగా వుంది. కరోనా మరణాల లెక్క అంతుచిక్కడం లేదు. ఓ వైపు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మరణాలు మాత్రం ఆగడం లేదు. దేశంలో రెండో దశ విలయం కొనసాగుతోంది. అటు ఉత్తర్ ప్రదేశ్ లోని మహీర్ పూర్ లో యయునా నదిలో, ఇటు బిహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలోని గంగా నదిలో కొవిడ్ మృతదేహాలు వెలుగు చూశాయి. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు ఇలా నదిలో పడేశారని గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. తీరా చూస్తూ అటు గంగా నదిలో ఏకంగా 150కి పైగా మృతదేహాలు నీటిలో తేలగా, ఇటు యమునా నదిలోనూ పదుల సంఖ్యలో మృతదేహాలు తేలుతూ కనిపించాయి.
గ్రామాల్లో కరోనా బారిన పడిన అనేక మంది మృత్యువాత పడుతున్నారని, వారి అంత్యక్రియలకు శ్మశానాల్లో స్థలం కూడా సరిపోవడం లేదని, దీంతో శవాలను ఇలా నదిలోని నీటిలో పడవస్తే చనిపోయిన వారికి పునర్జన్మ ఉండదని భావించిన పలువురు అటు గంగా నది, ఇటు యమునా నదుల్లో మృతదేహాలను పడవేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక మరికొన్ని గ్రామాల్లో యమునా నది ఒడ్డునే అంత్యక్రియలను కూడా నిర్వహించారు. ఈ వార్తలు వెలువడిన తరువాత బీహార్ లోని బక్సర్ జిల్లాలోనూ గంగా నదిలో 150 మృతదేహాలు నీటిలో తేలుతూ కనిపించాయి.
అయితే వీటి గురించి ఆరా తీయగా ఇవి ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకు వచ్చాయని, తమ రాష్ట్రానికి చెందినవి కావని బక్సర్ జిల్లా అధికార యంత్రాంగం బదులు ఇచ్చింది. జిల్లాలోని మహదేవ్ ఘాట్ వద్ద సుమారు 100 మృతదేహాలు గంగా నది నీటిలో తేలియాడుతూ కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చౌదాకు చెందిన బీడీఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ ‘‘మహదేవ్ ఘాట్కు 40 నుంచి 45 శవాల వరకు కొట్టుకువచ్చాయి. ఇవి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవి. కొవిడ్తో ఇక్కడి వారెవరైనా మరణిస్తే కాల్చివేసే సంప్రదాయం ఉంది. దానికి ఒక కాపలా దారుడిని పెట్టి మరీ కాల్చివేత ప్రక్రియను కొనసాగిస్తున్నామని అన్నారు.
అయితే ఈ మృతదేహాలు మాత్రం ఉత్తర ప్రదేశ్ నుంచే వచ్చి ఉంటాయి. నదిలో మృతదేహాలను అడ్డుకునే మార్గం లేనందున ఇక్కడి వరకు కొట్టుకువచ్చాయి’’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్లో వందల సంఖ్యలో కొవిడ్ మృతులను కాల్చివేస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. హామీర్ పూర్ నుంచి కాన్పూర్ జిల్లాల వరకు రోజూ లెక్కకు మించిన మరణాలు నమోదవుతున్నాయని, కానీ, పట్టించుకునేవారు లేరని ఆయా జిల్లాల గ్రామస్థులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో గంగానదిలో తేలిన మృతదేహాలు ఉత్తరప్రదేశ్ కు చెందినేవనని బిహార్ అధికారులు చెప్తుండడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే నెటిజెన్లు పెద్ద ఎత్తున ఈ విషయమై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more