జననం నుంచి మరణం వరకు మనిషికి నిత్యం తోడుగా వుండేది నీడ.. అందుకనే కాబోలు సినిమా డైలాగ్ రైటర్లు కూడా నిన్నే కాదు నీ నీడను కూడా కనిపించకుండా చేస్తాను అంటూ పాత సినిమాల్లో డైలాగులు రచించారు. మనిషిని నిత్యం పెనవేసుకునే నీడ ఒక్కసారిగా మాయమైతే.. ఎలా వుంటుంది. ఇదేదో సినిమా స్టొరీ కాదు సుమా. నిజంగా నిజం. సూర్యుడి కిరణాల వెలుతురు ఆధారంగా మనిషి నీడ అందుకు వ్యతిరేక దిశలో పడుతుండటం మనం నిత్యం చూస్తేనే వుంటాం. ఎండలో నిలబడితే చాలు మనిషి తన నీడ గమనించవచ్చు, లేదా సూర్య కిరణాలు పడిన చోటున కూడా నీడ కనిపిస్తోంది.
అంతేకాదు సూర్యడి కిరణాలు నేరుగా పడే భవనాలు, చెట్లు, ఇత్యాదులన్నీ తామ నీడను సూర్యడికి వ్యతిరేక దిశలో పడుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఇంతలా నిత్యం వెంటాడే నీడ ఒక్కసారిగా అదృశ్యమైతే.. అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో మధ్యహ్నం సరిగ్గా 12 గంటల సమయంలో కొన్ని క్షణాల పాటు నీడ అదృశ్యమైంది. నీడ జాడ లేకపోవడంతో స్థానికులు షాక్ లో మునిగిపోయారు. ఔరా ఇదేలా.. ఇంతటి విచిత్రమేలా.. మునుపెన్నడూ కనీవిని ఎరుగని రీతిలో నీడ మాయం కావడమేలా అంటూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.
స్థానిక శ్రీసత్యసాయి గురుకులం వైస్ ప్రిన్సిపాల్, భూగోళ శాస్త్ర ఉపాధ్యాయుడు, భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతికశాఖ అనుబంధ సంస్థ వీఐపీఎన్ఈటీ సమన్వయకర్త గుర్రయ్య ఈ విషయమై స్పందిస్తూ.. నీడ అదృశ్యం కావడం ఏడాదిలో రెండు పర్యాయాలు జరుగుతుందని అన్నారు. అయితే దీనికి గల కారణాలను ఆయన విశ్లేషించారు. దక్షిణ భారతదేశంలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయన్నారు. ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ప్రదేశాల్లో ఏడాదికి రెండుసార్లు ఇలాంటి ఘటనలు కనిపిస్తుంటాయన్నారు. ఆ సమయాల్లో సూర్యకిరణాలు నిట్టనిలువుగా భూమిని చేరుతాయని అందువల్లే నీడ కనిపించదని అన్నారు. సూర్యుడు ఉత్తర, దక్షిణ దిశగా పయనిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయని, ఈ ఏడాది ఆగస్టు 5న కూడా ఇక్కడ ఇలాంటి దృశ్యమే కనిపిస్తుందని గుర్రయ్య వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more