యావత్ ప్రపంచ మానవాళిపై ప్రభావం చేపుతున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు భారత్ సహా పలు దేశాలు ఇప్పటికే తమ దేశపౌరులకు వాక్సీన్ ను అందిస్తున్నాయి. దీంతో కరోనా నియంత్రణ చేపట్టవచ్చని దశలవారీగా వాక్సీన్ ను అందిస్తున్నాయి. అయితే ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వయస్సు వారందరికీ వాక్సీన్ అందించాలని అటు కేంద్రం నిర్ణయించగా, అందుకు గాను రాష్ట్రాలను వాక్సీన్ అయ్యే ఖర్చును చెల్లిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలోని ప్రజలకు అవసరమయ్యే వాక్సీన్ మొత్తానికయ్యే ఖర్చును ఒక్క చెక్కుతో చెల్లిస్తామని కూడా అన్నారు. అయినా భారత్ లో అభివృద్ధి చెందుతున్న కరోనా వ్యాక్సిన్లు మాత్రం ప్రజలందరికీ అవసరమయ్యే స్థాయిలో ఉత్పత్తి చెందడం లేదన్న విషయం తెలిసిందే.
ఇక ఇవాళ్టి నుంచి 18 ఏళ్లు నిండిన దేశ ప్రజలందరికీ వాక్సీన్ వేసుకునే వెసలుబాటు కల్పించడంతో రాష్ట్రాలన్నీ అందుకు తగిన స్థాయిలో కరోనా వ్యాక్సిన్ల కోసం కేంద్రం వైపు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. అయితే వాక్సీన్ల కొరతతో టీకాలు అందక ప్రజలు అరోగ్య కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంకాలం వరకు పడిగాపులు కాస్తూ టీకాలు వేయించుకుంటున్నారు. అయినా కొరత కారణంగా అనేక మందికి టీకాలు అందక సతమతమవుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు తాండవిస్తున్న వేళ మధ్యప్రదేశ్ లో తీవ్ర కలకలం రేగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు లక్షల నలబై వేల కరోనా టీకాలను తరలిస్తున్న ఓ ట్రక్కు రోడ్డు పక్కన వదిలేసి వెళ్లడమే అందుకు కారణం.
నర్సింగ్ పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరేలీ ప్రాంతంలో బస్టాండ్కు సమీపంలో ఓ ట్రక్కు చాలా సేపు ఆగి ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రక్కును తెరిచి చూడగా.. అందులో దాదాపు 2,40,000 డోసుల కొవాగ్జిన్ టీకాలు కన్పించాయి.ట్రక్కు మీదున్న నంబరుతో డ్రైవర్ మొబైల్ లోకేషన్ను ట్రేస్ చేయగా.. హైవే సమీపంలోని చెట్ల పొదల్లో ఉన్నట్లు గుర్తించారు. ట్రక్కులోని ఎయిర్ కండిషన్ పనిచేస్తుందని, డోసులు సురక్షితంగానే ఉన్నాయని పోలీసులు తెలిపారు. వాటి విలువ దాదాపు 8కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more