తెలంగాణ వైద్యఅరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సహా ఆయన అనుచరులైన పలువురు మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేటలో అసైన్డ్ భూములు కబ్జా చేశారన్న అరోపణలపై ఇవాళ విజిలెన్స్ డిజి పూర్ణచంద్రర్ రావు నేతృత్వంలో విజిలెన్స్ అధికారులు, అవినితీ నిరోధక శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. మంత్రిపై ఫిర్యాదులు చేసిన రైతుల నుంచి అధికారులు వివరాలు సేకరించారు. తమకు 1994లో అప్పటి ప్రభుత్వం భూమిలేని తమకు భూమిని అసైన్ చేసిందని.. ఆ భూమిని తాజాగా ఈటెల అనుచరులు కబ్జా చేశారని వారు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా సీఎస్ సోమేష్ కుమార్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహా మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ కూడా లేఖలు రాశారు.
ఈ లేఖలపై స్పందించిన సీఎం కేసీఆర్ ఆరోపణలపై దర్యాప్తు జరిపి వేగంగా ఒక నివేదికను సమర్పించాలని ఆయన విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ పూర్ణచంద్రరావును అదేశించారు. దీంతో పాటు సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. వందల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములను తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ కాజేశారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానిపై విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. విజిలెన్స్ ఎస్సీ మనోహర్, తూప్రాన్ అర్డీవో రాంప్రకాశ్ ఆధ్వర్యంలో అధికారులు భూమునులను సర్వే చేస్తూ విచారణను కోనసాగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అచ్చంపేటకు భారీగా పోలీసులు చేరుకున్నారు.
కాగా మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ విజిలెన్స్ అధికారులు అందించిన విచారణ నివేదికను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూసాపేట తహసీల్దార్ కార్యాలయంలో భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆనంతరం ఈటెలకు చెందిన అచ్చంపేట భూముల్లో అసైన్డ్ భూములు వున్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు తమ ప్రాథమిక విచారణలో ఈ విషయం తేటతెల్లమైందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తైన తరువాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని స్పష్టం చేశారు. తూప్రాన్ ఆర్డీవో రాంప్రకాశ్ నేతృత్వంలోని ఆరు ప్రత్యేక బృందాలు ఈ భూమిలో సర్వే నిర్వహించాయని కలెక్టర్ తెలిపారు.
మంత్రి ఈటెల రాజేందర్ కు చెందిన హేచరీస్ డిజిటల్ సర్వే కోనసాగుతోందని, దీంతో పాటు హేచరీస్ పక్కనవున్న అసైన్డ్ భూముల్లోనూ అధికారులు డిజిటల్ సర్వే కోనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై అటు ఈటెల అనుచరులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. శామీర్ పేటలోని ఈటల రాజేందర్ ఇంటి వద్దకు అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈటలకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. ఉద్యమపార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరించిన ఈటెలను ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉండకుండా తప్పించేందుకు వ్యూహాత్మకంగా ఈటెల హేచరీస్ అంశాన్ని పార్టీ పెద్దలు తెరపైకి తీసుకువచ్చారని ఆయన అనుచరులు అరోపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more