బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి ప్రమేయం లేదని తేల్చిన బెంగుళూరు పోలీసులు తాజాగా సినీపరిశ్రమకు చెందిన లింకులు ఫైనాన్షియర్ల రూపంలో వున్నాయని దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ కేసులో తెలంగాణకు చెందిన కొందరు వ్యాపారవేత్తలతో పాటు రాష్ట్రానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంది.
ఈ కేసులో కీలకంగా మారిని ఇద్దరు హైదరాబాద్ వ్యాపారవేత్తలను బెంగళూరు పోలీసులు విచారించారు. వారి విచారణలో పలు ఆసక్తికర విషయాలు బహిర్గతమయ్యాయని సమాచారం. ఈ కేసులో నగరానికి చెందిన సందీప్రెడ్డి, కలహర్ రెడ్డిల పాత్రపై దర్యాప్తు చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే సందీప్రెడ్డిని బెంగళూరు పోలీసులు విచారించారు. బెంగళూరులో సందీప్, కలహర్రెడ్డి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో పబ్లు, హోటల్స్ వ్యాపారంలో వీరిద్దరూ ఉన్నారు.
తెలంగాణకు చెందిన ప్రముఖులకు నిత్యం పార్టీలు ఇస్తున్నట్టు గుర్తించారు. కన్నడ సినీ పరిశ్రమతో కూడా వీరికి సంబంధాలు ఉన్నాయి. కన్నడ సినీ పరిశ్రమకు కలహర్, సందీప్లు ఫైనాన్స్ చేస్తున్నారు. నిర్మాత శంకర్గౌడ్తో కలిసి ఫైనాన్స్ చేస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కొన్నాళ్ల క్రితం నైజీరియన్స్ను బెంగళూరు పోలీసులు పట్టుకోగా.. తీగ లాగితే డొంక కదిలింది. కలహర్, సందీప్, శంకర్గౌడ్లకు ఈ నైజీరియన్స్ డ్రగ్స్ సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యాపారవేత్తలకు బెంగళూరు పోలీసులు నోటీసులిచ్చారు.
అయితే ఈ కేసులో కలహర్రెడ్డి, శంకర్గౌడ్ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. కలహర్రెడ్డి ప్రజా ప్రతినిధులకు పార్టీలిచ్చేవాడని విచారణలో సందీప్ తెలిపాడు. పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు, తెలుగు సినీ ప్రముఖులు పాల్గొన్నారని చెప్పాడు. ఓ ఎమ్మెల్యే నేరుగా కొకైన్ను తీసుకెళ్లినట్లుగా తెలిపాడు. ఎమ్మెల్యే కోరిక మేరకు పలుమార్లు కొకైన్ పంపినట్లు సందీప్ చెప్పుకొచ్చాడు. నలుగురు ఎమ్మెల్యేలు కూడా డ్రగ్స్ తీసుకున్నారని విచారణలో సందీప్ వెల్లడించాడు. కలహర్రెడ్డి, శంకర్గౌడ్తోపాటు ఆ నలుగురు ఎమ్మెల్యేలను బెంగళూరు పోలీసులు విచారించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more
Apr 02 | వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు జరిగి రెండేళ్లు అవుతుందని, అయినా నిందితులను ఇప్పటివరకు రాష్ట్ర పోలీసులు పట్టుకోలేకపోయారని ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి హత్యకేసులో తప్పనిసరిగా రాజకీయ ప్రయోజనాలు... Read more