YSRCP MLA RK Roja undergoes couple of surgeries శరద్ పవార్ కు తీవ్ర అనారోగ్యం.. అపోలో అసుపత్రిలో చేరిన రోజా

Ncp chief sharad pawar to undergo surgery mla roja undergoes surgeries

sharad pawar, Nawab malik, sharad pawar in hospital, NCP chief, Sharad Pawar, Sharad Pawar unwell, Sharad Pawar hospital, Sharad Pawar surgery, RK Roja, YSRCP MLA, APIIC Chairman, Selvamani, two major surgeries, Apollo Hospital, Chennai, Andhra Pradesh, Politics

Nationalist Congress Party (NCP) chief Sharad Pawar was taken to Mumbai's Breach Candy Hospital after he complained of pain in his abdomen, confirmed party leader Nawab Malik. YSRCP MLA RK Roja underwent two major surgeries at a private hospital in Chennai and was resting in a general ward.

ఎన్సీపి అధినేత శరద్ పవార్ కు తీవ్ర అనారోగ్యం.. వైసీపీ ఎమ్మెల్యే రోజాకూ..

Posted: 03/29/2021 03:42 PM IST
Ncp chief sharad pawar to undergo surgery mla roja undergoes surgeries

నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. హుటాహుటిన స్పందించిన కుటుంబసభ్యులు అయనను అసుపత్రికి తరలించారు. దీంతో ఆయ‌న ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న క్రితం రోజున పొత్తి కడుపులో తీవ్ర నొప్పితో బాధపడ్డారని, వెంట‌నే ఆయ‌నను కుటుంబ స‌భ్యులు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారని ఎన్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్ ట్వీట్ చేశారు. దీంతో శరద్ పవార్ పాల్గోనాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్టు ఆయన తెలిపారు.

ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయగా, అతనికి పిత్తాశయంలో సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో మార్చి 31న శస్త్రచికిత్స జరగనుందని.. ఆ తరువాత కూడా వైద్యుల సూచనలు మేరకు ఆయనుకు విశ్రాంతి కల్పించడం జరుగుతుందని ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ చెప్పారు. మహారాష్ట్రలో చెలరేగిన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఎన్సీపీ అధినేత పవార్ భేటీ అయిన తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. శరద్ పవార్ పూర్తి ఆరోగ్యవంతులైన తరువాత.. అనారోగ్యం నుంచి పూర్తిగా కొలుకున్న తరువాతే మళ్లీ అన్ని కార్యక్రమాలను పునరావృతం అవుతాయని చెప్పారు.

ఇటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా అనారోగ్యానికి గురయ్యారు. చెన్నై ఆపోలో ఆస్పత్రిలో ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయని సమాచారం. రోజాకు శస్త్రచికిత్సలు జరగడంపై అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అమె భర్త దర్శకుడు సెల్వమణి ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం రోజా అరోగ్యం నిలకడగానే వుందని, వైద్యుల సూచనల ప్రకారం అమె పక్షం రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అభిమానులు ఎవ్వరూ అమెను కలిసేందుకు రావద్దని సూచించారు. ఇక ఈ సర్జరీలు గతేడాదిలోనే చేసుకోవాల్సి వుండగా, కరోనా కారణంగా వాయిదా వేశామని, ఆ తరువాత రాష్ట్రంలో ఎన్నికలు రావడంతో ఇప్పుడు చేయించుకున్నట్లు సెల్వమణి వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sharad pawar  Nawab malik  abdomen pain  NCP chief  Mumbai  Candy breach Hospital  Maharashtra  

Other Articles