నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన స్పందించిన కుటుంబసభ్యులు అయనను అసుపత్రికి తరలించారు. దీంతో ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన క్రితం రోజున పొత్తి కడుపులో తీవ్ర నొప్పితో బాధపడ్డారని, వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారని ఎన్సీపీ జాతీయ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. దీంతో శరద్ పవార్ పాల్గోనాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్టు ఆయన తెలిపారు.
ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయగా, అతనికి పిత్తాశయంలో సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో మార్చి 31న శస్త్రచికిత్స జరగనుందని.. ఆ తరువాత కూడా వైద్యుల సూచనలు మేరకు ఆయనుకు విశ్రాంతి కల్పించడం జరుగుతుందని ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ చెప్పారు. మహారాష్ట్రలో చెలరేగిన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్షాతో ఎన్సీపీ అధినేత పవార్ భేటీ అయిన తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. శరద్ పవార్ పూర్తి ఆరోగ్యవంతులైన తరువాత.. అనారోగ్యం నుంచి పూర్తిగా కొలుకున్న తరువాతే మళ్లీ అన్ని కార్యక్రమాలను పునరావృతం అవుతాయని చెప్పారు.
ఇటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా అనారోగ్యానికి గురయ్యారు. చెన్నై ఆపోలో ఆస్పత్రిలో ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయని సమాచారం. రోజాకు శస్త్రచికిత్సలు జరగడంపై అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అమె భర్త దర్శకుడు సెల్వమణి ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం రోజా అరోగ్యం నిలకడగానే వుందని, వైద్యుల సూచనల ప్రకారం అమె పక్షం రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అభిమానులు ఎవ్వరూ అమెను కలిసేందుకు రావద్దని సూచించారు. ఇక ఈ సర్జరీలు గతేడాదిలోనే చేసుకోవాల్సి వుండగా, కరోనా కారణంగా వాయిదా వేశామని, ఆ తరువాత రాష్ట్రంలో ఎన్నికలు రావడంతో ఇప్పుడు చేయించుకున్నట్లు సెల్వమణి వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more