కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా నేడు తలపెట్టిన భారత్ బంద్, ఉత్తరాది రాష్ట్రాల్లో సంపూర్ణంగా జరుగుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీకి దారితీసే అన్ని రహదారులనూ రైతులు దిగ్బంధించగా, ప్రజలకు నిత్యావసరాలైన పాలు, కూరగాయలు సరఫరా చేసే వాహనాలు సైతం నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే నాలుగు రైళ్లు పూర్తిగా రద్దు కాగా, 30కి పైగా రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లను ఢిల్లీ, చండీగఢ్, ఫిరోజ్ పూర్, అమృతసర్ తదితర స్టేషన్లలో నిలిపివేశారు.
దేశ రాజధాని చుట్టు పక్కల ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో భారత్ బంద్ తీవ్రంగా వుంది. జాతీయ రహదారి - 9పై రైతులు బైఠాయించడంతో ఘజియాపూర్ నుంచి ఢిల్లీకి రాకపోకలు నిలిచిపోయాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసినా, రైతు నిరసనలు మాత్రం ఆగలేదు. ఇదే సమయంలో సింఘూ సరిహద్దుతో పాటు తిక్రి సరిహద్దుల్లో సైతం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తమ మనసులోని మాటను ప్రభుత్వానికి చేరవేసేందుకు పాలు, నిత్యావసరాల వాహనాలను కూడా అడ్డుకుంటున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ ఓ వీడియో మెసేజ్ ని విడుదల చేశారు.
వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాలన్నీ ఒకే మాటపై ఉన్నాయని, ఈ ఉదయం 5 గంటలకు మొదలైన నిరసనలు సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగిస్తామని మరో రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ వెల్లడించినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. బంద్ ప్రభావంతో ఢిల్లీలోని దాదాపు అన్ని మార్కెట్లూ మూతపడ్డాయి. ఇదేసమయంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ మాత్రం తాము బంద్ లో పాల్గొనడం లేదని, షాపులు తెరిచే వున్నాయని ప్రకటించింది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా తీవ్ర నష్టాల్లో ఉన్న వ్యాపారులు, ఇటువంటి బంద్ లతో మరింతగా నష్టపోతారన్న ఉద్దేశంతోనే బంద్ కు మద్దతు ఇవ్వలేదని వారు స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more