తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్నాళ్లుగా తెలంగాణ ఉద్యోగులకు మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా వారిపై వరాల జల్లు కురిపించారు. తెలంగాణ ప్రభుత్వంపై కాసింత ముభావంగా వున్న కొన్ని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యయులందరినీ తనవైపు తిప్పుకునేందుకు ఆయన అసెంబ్లీనే వేదిక చేసుకుని వారిపై వరాలను కురిపించారు. పే రివిజన్ కమీషన్ (పీఆర్సీ)పై ప్రకటన చేసే క్రమంలో ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే చర్యలకు శ్రీకారం చుట్టారు.
ఐదేళ్లకో పర్యాయం ప్రకటించే పీఆర్సీని ఇవాళ అసెంబ్లీలో ప్రకటించారు ముఖ్యమంత్రి, శాసనసభలో ముఖ్యమంత్రి పీఆర్సీపై ప్రకటన చేస్తూ.. ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్ బెనిఫిట్ కల్సిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పీఆర్సీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని తెలిపారు. కరోనా కారణంగా పీఆర్సీ ప్రకటన కొంత ఆలస్యమైందన్న ఆయన.. అన్ని అంశాలను దృష్టిలో పెట్టకునే కమీషన్ నివేదిక అందించిందని తెలిపారు. కమీషన్ నివేదికను సీఎస్ అధ్యక్షతన కమిటీ నివేదికపై అద్యయనం చేసిందని, ఆ తరువాతే దానిపై అమోదాన్ని తెలుపి ఇవాళ ప్రకటిస్తున్నానని సీఎం తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు పెనషనర్లు, పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులు, హోంగార్డులకు పీఆర్సీ వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలు, సెర్ఫ్ ఉద్యోగులు, విద్యావాలెంటీర్లు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, వీఆర్ఏ, వీఏవోలకు కూడా పీఆర్సీ అములు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్దిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో వారి పదవీ విరమణ పరమితిని 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ఇది తక్షణం అమల్లోకి వస్తుందని కేసీఆర్ ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more