ప్రకృతి సొంత రాష్ట్రంగా బాసిల్లుతున్న.. నూరుశాతం అక్షరాస్యతతో పరఢవిల్లుతున్న రాష్ట్రంగా కేరళ దేశంలోనే చక్కటి గుర్తింపును పోందింది. ఈ రాష్ట్రంలో మరి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు ఎలా వుంటాయన్న సర్వత్రా ఆసక్తి కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేరళ ఓటర్లను తనదైన శైలిలో అకర్షించేందుకు పలు పర్యాయాలు పర్యటనలు చేశారు. తన సుడిగాలి పర్యటనలతో పాటు మేధావులతో సమావేశాలలోనూ పాల్గోన్నారు. ఇక ఇటు వామపక్షాలు కూడా తమ అస్త్రశస్త్రాలను ఇప్పటికే సిద్దం చేశాయి. ఇక చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన గోల్డ్ స్కామ్ ఒక్కటి ఎల్డీఎఫ్ కూటమికి శరాఘాతంలా తయారైంది.
అసెంబ్లీ ఎన్నికల గెలిచేందుకు ఇప్పటికే పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇక తమ తమ నియోజకవర్గాలలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీపీఐ (ఎం) అభ్యర్థిగా కన్నూరు జిల్లా ధర్మాడం నుంచి బరిలో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన నామినేషన్ పత్రాలను మంగళవారం నాడు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన ఎన్నికల నామినేషన్ లో తన ఆస్తుల వివరాలను పోందుపర్చుతూ అఫిడవిట్ కూడా సమర్పించారు. అయితే ఈ అఫిడవిట్ చూసిన మీడియా కూడా విస్మయం చెందింది.
ఎందుకంటే ఆయన పేరున కనీసం కోటి రూపాయల ఆస్తులు కూడా లేవు. సొంత వాహనాలు లేవు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన ఆయన తన పేరును కేవలం అరకోటికి పైగా మాత్రమే అస్తులు వున్నాయని అంతకుమించి లేవని అఫిడవిట్ లో పేర్కోన్నారు. అయితే ఆయన సతీమణి కమలా విజయన్ పేరున అంతకు కోద్దిగా ఎక్కువగా ఆస్తులు వున్నాయే తప్ప.. అమె పేరున కూడా కోటి రూపాయలకు మించిన ఆస్తులు లేకపోవడం గమనార్హం. కమలా విజయన్ పేరు మొత్తంగా రూ. 60 లక్షల మేర మాత్రమే ఆస్తులు కలిగివున్నారు. వీరిద్దరి పేరున ఉన్న ఆస్తులను జతపర్చగా మొత్తంగా కోటి పది లక్షలు మాత్రమే.
పినరయి ఆస్తులన్నీ కలిపితే కేవలం రూ.54 లక్షలు మాత్రమే ఉన్నాయి. 2020 21లో ఆయన వార్షిక ఆదాయం రూ.2.87 లక్షలుగా పేర్కొన్నారు. రెండు సొంత ఇళ్లు ఉన్నాయని, సొంత వాహనం లేదని ప్రకటించారు. పినరయి పేరిట రూ.51.95 లక్షల విలువైన స్థిరాస్తులు, 2.04 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు. అయితే తన భార్య పేరిట రూ.35 లక్షల విలువైన స్థిరాస్తులు, రూ.29.7లక్షల చరాస్తులు ఉన్నాయని తెలిపారు. అయితే ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేసి రిటైరయ్యారని ఈ సందర్భంగా అఫిడవిట్లో పినరయి స్పష్టంగా రాయించారు. అయితే వీరిద్దరికీ అప్పులు ఏమీ లేకపోవడం విశేషం. భార్య పేరిట రూ.3.3 లక్షలు విలువ చేసే 80 గ్రాముల బంగారం ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more