హైదరాబాద్ నగరంలో ఇంట్లో అమ్మాయిలు ఒంటరిగా వున్న క్షేమంగా వుంటారన్న నమ్మకం లేదు. ఇంట్లో ఎవరూ లేరని, అమ్మాయి ఒక్కతే వుందని పక్కాగా సమాచారం అందుకున్న అగంతకులు తాము ప్రైవేటు బ్యాంకు నుంచి వస్తున్నామని, వారిట్లోకి చోరబడి ఓ అగంతకుడు యువతిపై దారుణానికి ఒడిగట్టాడు. అతనితో పాటు వచ్చిన మరో అగంతకుడు యువతిపై అత్యాచారం జరుగుతున్న సమయంలో కాపలాగా ఇంటి బయట పహారా కాసాడు. నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా ఇవాళ ఉదయం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున వున్న పంజాగుట్ట, డీఎస్ మక్తాలో ఈ దారుణఘటన చోటుచేసుకుంది. అనునిత్యం జనసామర్థ్యం వున్న ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటేచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్టలోని డీఎస్ మక్తా ప్రాంతంలో నివాసం వుంటున్న ఓ కుటుంబం.. మహారాష్ట్రకు వెళ్లింది. అయితే ఇంట్లో ఎవరూ లేకుండా వెళ్తే బాగోదని, 23 ఏళ్ల యువతిని ఇంటికి కపలాగా పెట్టి వెళ్లారు. దీంతో ఇంట్లో అమె ఒక్కతే ఒంటరిగా వుంటోంది.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు నిన్న సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లి, తాము ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులమని పరిచయం చేసుకున్నారు. తర్వాత తమ బ్యాంకు నుంచి ఫైనాన్స్ ఇస్తామని యువతితో మాటలు కలిపారు. అనంతరం వారిలో ఓ వ్యక్తి ఇంటి బయటకు వెళ్లి కాపలా ఉన్నాడు. ఇలోగా ఇంట్లో వున్న మరో అగంతకుడు యువతితో మాట్లాడుతూ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాట్టాడు. అనంతరం ఈ ఘటనపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితులను గుర్తించడానికి పోలీసులు అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more