ఇక్వెటోరియల్ గినియా దేశంలో భారీ పేలుళ్లు సంభవించాయి. మిలిటరీ క్యాంప్ లో ప్రమాదం చోటుచేసుకుని సంభవించిన పేలుళ్లలో 20 మంది వరకు మృత్యువాతపడగా, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. దేశ ఆర్థిక రాజధాని బాటాలోని కోమా న్కోయా సైనిక శిబిరం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నగరంలోని చాలా భవనాలు పూర్తిగా అగ్నికి ఆహుతి కాగా.. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇక మరికొన్ని భవనాలు భారీ విస్పోటనం ధాటికి చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఈ పేలుళ్లతో కోమా న్కోయా ప్రాంతమంతా దట్టమైన నల్లని పోగ అలుముకుంది.
ఆ ప్రాంతవాసులు ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని.. ఆ దేశ ఆరోగ్య శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఇక కోమా న్కోయాతో పాటుగా బాటాలోని ఆస్పత్రుల్లో వద్ద భాయానక వాతావరణం అలుముకుంది. రుధిర గాయాలతో చికిత్స కోసం ఎదురుచూస్తున్న క్షతగాత్రులతో అక్కడి పరిస్థితులు భయానకంగా మారాయి. చిన్నారులు, పెద్దలతో పాటు అనేక మంది క్షతగాత్రులను శిధిలాల కింద నుంచి అసుపత్రులకు తరలిస్తుండటంతో అక్కడంతా క్షతగాత్రులు, బంధవుల అర్తనాథాలతో విషాధకర వాతావరణం అలముకుంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఇక్వెటోరియల్ గినియా అధ్యక్షుడు ట్యొడొరో ఓబ్యాంగ్ గెమా వివరించారు. ‘కోమా సైనిక శిబిరానికి సమీపంలో రైతులు తమ పొలాల్లో పంట వ్యర్థాలను దహనం చేపట్టగా.. మంటలు అదుపు తప్పి పేలుళ్లకు దారి తీసింది. సైనిక శిబిరంలో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన విభాగ ఇన్ఛార్జి నిర్లక్ష్యం కారణంగా నగరం ప్రమాదానికి గురైంది’అని ట్యొడొరో వివరించారు. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న తరుణంలో ఇప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుందని ట్యొడొరో తెలిపారు. ప్రపంచదేశాలు సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 20 మంది మరణించి ఉంటారని ఇక్వెటోరియల్ గినియా రక్షణ శాఖ వెల్లడించింది. మరో 600 మంది గాయపడి ఉంటారని పేర్కొంది. ఈ పేలుడు ధాటికి చాలా నివాసాలు నేలమట్టం అయ్యాయని తెలిపింది. బాటాలో సంభవించిన పేలుళ్ల పట్ల ఇక్వెటోరియల్ గినియాలోని భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ట్విటర్ ద్వారా సంతాపం తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more