కర్ణాటకకు చెందిన మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియో ఒకటి కర్ణాటకలో కలకలం రేపడంతో మంత్రి తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. సదరు రాసలీలల మంత్రివర్యుడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని విపక్షాలతో పాటు మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేయడంతో తలొగ్గిన మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఇంతవరకు బాగానే వున్నా ఇప్పడు కాంగ్రెస్ కర్ణాటక ముఖ్యమంత్రి తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ ను తెరమీదకు తీసుకురావడంలో కాంగ్రెస్ అంతర్యమేమిటంటే..
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన మంత్రి తనను లైంగిక అవసరాలకు వాడుకున్నారని ఓ మహిళ ఆరోపించడంతో పాటు ఏకంగా మంత్రి తనతో ఏకాంతంగా గడిపిన దృశ్యాల వీడియోను పలు మీడియా ఛానెళ్లకు సమాచార హక్కు చట్టం కార్యకర్త దినేశ్ కల్లహళ్లికి అందించగా.. అందులో మంత్రివర్యులు మహిళతో ఏకంతంగా గడిపిన దృశ్యాలతో పాటు ఆమెతో ఆయన చెప్పిన విషయాలపై జాతీయ మీడియా దృష్టిసారించింది. తాము ఈ వీడియో టేప్ లోని మాటల సారాంశాన్ని సేకరించడంతో అదికాస్తా కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన అస్త్రంగా మారింది.
తమ గూటికి చెందిన పక్షులను కాపాడుకోవడంలో అరితేరిన రాజకీయపార్టీలు.. ఇలా ఒక మంత్రి పదవిలో వున్న నేతను పదవికి రాజీనామా చేయాలని తెర వెనుకగా రాష్ట్ర అధిష్టానం కూడా ఒత్తిడి చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు అసలు కారణం ఏమీటి.? మంత్రివర్యులు మాట్లాడిన విషయాలేమిటీ.? అన్న వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్డియూరప్ప భారీ అవినీతికి పాల్పడ్డాడని ఆయనపై అరోపణలు గుప్పించడమే కాకుండా.. కర్ణాటక రాష్ట్రం నుంచి కేంద్ర బోగ్గు గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రహ్లాద్ జోషి.. త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
మరాఠీలు మంచివారని పేర్కోన్న ఆయన.. కర్ణాటకవాసులకు అసలు ఏం పనిలేకుండా పోయిందని ఆయన అన్నారు. ఇక రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత సిద్దరామయ్య చాలా మంచి నాయకుడని ఆయనపై ప్రశంసలు కురిపించిన మంత్రి రమేష్..అదే సమయంలో తమ సీఎం యడియూరప్పపై మాత్రం అవినీతి పరుడంటూ ముద్రవేశారు. ఈ క్రమంలో ఇది సెక్స్ కుంభకోణం మాత్రమే కాదని, సీఎం పెద్ద అవినీతిపరుడని మంత్రే స్వయంగా అంటున్నాడని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఆరోపించారు. దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బంతి ఇప్పుడు బీజేపీ కోర్టులోనే ఉందని, బీజేపీ సరైన నిర్ణయమే తీసుకుంటుందని భావిస్తున్నానని శివకుమార్ అభిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more