ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద గస్తికాస్తున్న పోలీసులు ఒడిశా నుంచి విశాఖపట్నం వైపుకు వెళ్తున్న ఓ కారు నిలిపి వీళ్లు గంజాయిని ఏమైనా తరలిస్తున్నారా అన్న అనుమానంతో చెక్ చేయగా.. వారికి కళ్లు చెదిరే కరెన్సీ కట్టలు కనిపించాయి. ఒడిశాలో కలర్ జిరాక్స్ తీసి విశాఖపట్నానికి తరలిస్తున్న రూ.7.90 కోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ఓ ఇంజనీర్ సహా మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఒడిశాలోని రాయ్ పూర్ లో తయారు చేసిన ఈ నోట్లను అనేక చెక్ పోస్టులు దాటించి చివరకు చిట్టచివరిదైన సుంకీ చెక్ పోస్టు వద్ద అడ్డంగా దొరికిపోయారు. చత్తీస్ గడ్ రిజిస్ట్రేషన్ నెంబరుతో వున్న ఈ కారును అన్ని చెక్ పోస్టులను ఎలా మ్యానేజ్ చేశారో తెలియదు కానీ సుంకీ వద్ద అగంతకులు అడ్డంగా బుక్ అయ్యారు. ఈ కారు రాకను గమనించిన పోలీసులు వీళ్లు గంజాయిని తరలిస్తున్నారా.? అన్న అనుమానంతో కారును తనిఖీ చేశారు. అప్పటికే అనుమానాస్పందంగా మారిన వీరు ప్రవర్తనను గమనించిన పోలీసులు వెనకాల డిక్కీని తేరచి తనిఖీ చేయగా ఏకంగా రూ. 7.90 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ లభించింది.
దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా రాయ్ పూర్ లో నకిలీ కరెన్సీని తయారుచేసినట్టు అంగీకరించారు. కలర్ జిరాక్స్ తీసి ఈ నోట్లను తయారు చేసినట్టు నిందితులు తెలిపారని పోలీసులు పేర్కోన్నారు. వీటిని విశాఖపట్టణం తరలిస్తున్నట్టు నిందితులు చెప్పారని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ. 35 వేల నగదు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనక ఓ ముఠా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more