ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన విరసం నేత వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర బెయిల్ ష్యూరిటీ విషయంలో ఆయన ఎదుర్కోంటున్న ఇబ్బందులను ఆయన తరపు సినియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ బాంబే హైకోర్టుకు తీసుకువెళ్లగా.. జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మనీష్ పిటాలేలతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఆయనకు బెయిల్ ష్యూరిటీగా రెండు నగదు పూచికత్తును ఇవ్వాల్సిందిగా అదేశాలు జారీ చేసింది. దీంతో వరవరరావు బెయిల్ పై విడుదల అయ్యేందుకు ఎట్టకేలకు మార్గం సుగమం అయ్యింది. ఇక త్వరలో వరవరరావు బెయిలుపై జైలు గోడల నుంచి విముక్తి పోందనున్నారు.
వరవరరావుకు గత నెల (ఫిబ్రవరి) 22న బెయిల్ లభించినా, మహారాష్ట్రలోని బెయిల్ ష్యూరిటీ నిబంధనల కారణంగా ఆయన విడుదల ఆలస్యం అయింది. మహారాష్ట్రలో బెయిల్ ష్యూరిటీకి ఆస్తి ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. నగదు పూచీకత్తులు, శాలరీ సర్టిఫికెట్లను ఇక్కడ అంగీకరించరు. దాంతో వరవరరావు విడుదల కోసం కుటుంబ సభ్యుల తరపున సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ మరోమారు బాంబే హైకోర్టును ఆశ్రయించగా, వరవర రావు బెయిల్ లభించిన రోజులు గడుస్తున్నా.. ఇక్కడి నిబంధనల కారణంగా ఆయన విడుదల ఆలస్యం జరుగుతుందని ఆయన న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ది.
దీనిపై విచారించిన న్యాయస్థానం వరవర రావు బెయిల్ విషయంలో నిబంధనలను మార్చింది. వరవర రావు బెయిల్ విషయంలో ఆయన రూ. 50 వేల చోప్పున రెండు నగదు పూచీకత్తులను ఏప్రిల్ 5వ తేదీలోపు సమర్పించాలని జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మనీష్ పిటాలేలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో వరవర రావు కుటుంబసభ్యులు ఆయన విడుదల కోసం రూ,50 వేల విలువ చేసే రెండు నగదు పూచీకత్తులను సిద్దం చేశారు. దీంతో ఇవాళ ఆయన బెయిల్ పత్రాల ప్రక్రియ పూర్తి కానుంది. ఇది పూర్తైన వెంటనే వరవరరావు ముంబయిలోని తలోలా జైలు నుంచి విడుదల కానున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more