హిందూ వారసత్వ చట్టం ప్రకారం మహిళలు తమకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను తమ ఇష్టానుసారం వారసులకు అందించవచ్చునని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పిల్లలు లేని హిందూ మహిళలు.. తమ తదనంతరం తమకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను తమ భర్త తరపు కుటింబికులకే కాకుండా.. అమె తన తండ్రి తరపు వారసులకు కూడా అందించవచ్చునని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. హిందూ కుటుంబం అనే పదాన్ని చిన్నగా చూడకూడదని ఈ సందర్భంగా సూచించింది.
హిందూ మహిళ తన తండ్రి తరపు వారసులను పరాయి వ్యక్తులుగా పరిగణించలేమని న్యాయస్థానం పేర్కోంది. ఈ మేరకు హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15(1)(డి) ప్రకారం హిందూ మహిళకు తన భర్త తరపు వారితో పాటు తన తండ్రి తరపు వారు కూడా వారసులుగానే పరిగణించాల్సి వుంటుందని పలు కేసులను జోడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. దీంతో హిందూ మహిళ తన తండ్రి తరపు వారసులకు కూడా తన ఆస్తిని పంచి ఇచ్చే అధికారం వుందని స్పష్టం చేసింది.
కుటుంబం అనే పదాన్ని విసృత్త భావంతో చూడాలని.. అంతేకాని దగ్గరి బంధువులను మాత్రమే కుటుంబంగా, చట్టబద్ద వారుసులుగా భావించడం సరికాదని పేర్కోంది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకభవించిన న్యాయస్థానం.. కక్షిదారులు వేసిన పిటీషన్ ను తోసిపుచ్చింది. హిందూ మహిళకు సంబంధించిన వీలునామా లేని వారసత్వ అస్తులు సెక్షన్ 16 ప్రకారం పరిగణించబడతాయని సెక్షన్ 15 చెబుతోందని న్యాయస్థానం పేర్కోంది. దీని ప్రకారం.. మొదట, అమె కుమారులు మరియు కుమార్తెలపై (లేదా మనువలు, మనువరాళ్లు) మరియు భర్తకు.. లేదా భర్త వారసులకు, లేదా తల్లిదండ్రులకు, లేదా తల్లిదండ్రుల వారసులకు ఇక చివరగా తల్లి తరపు వారసులకు కూడా ఇచ్చే అధికారం ఉందని న్యాయస్థానం పేర్కోంది.
సంతానం లేని వితంతువు తన సోదరుల కొడుకుకు అనుకూలంగా తనకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని అప్పగించడాన్ని అనుమతించిన హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ సందర్భంలో, జగ్నో అనే మహిళకు సంబంధించిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. భర్త షేర్ సింగ్ మరణానంతరం తనకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని తన సోదరుడి కుమారులకు పంచి ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ షేర్ షింగ్ కుమారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, న్యాయస్థానం వారి పిటీషన్ ను తోసిపుచ్చింది. ఆస్తిపై జగ్నోకు పూర్తి హక్కులు వున్నాయని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more