అమ్మాయిల కాలేజీకి వద్ద కోతుల బ్యాచ్ తిష్ట వేసింది. ఉదయం, సాయంకాలలతో పాటు రాత్రి వేళ్లలోనూ అక్కడే అవాసాన్ని ఏర్పాటు చేసుకుని కాలేజీ విద్యార్థినులతో పాటు ఉపాద్యాయులను కూడా వేధిస్తున్నాయి. ఈ కోతుల బ్యాచ్ పై అటు కాలేజీ యాజమాన్యం ఎన్నిమార్లు పిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో.. చివరాఖరున జిల్లా కలెక్టరుకే కాలేజీ యాజమాన్యం పిర్యాదు చేయడానికి సిద్దమైంది. ఏమిటో బ్లేడ్ బ్యాచ్, రౌడీ బ్యాచ్ లా ఈ కోతుల బ్యాచ్ అనుకుంటున్నారా.? అలాంటిదేమీ లేదండీ ఇది నిజంగా కోతుల బ్యాచ్చే.
లాక్ డౌన్ నాటి పరిస్థితులను అసరగా చేసుకుని ఎంతో ప్రశాంతంగా వున్న కాలేజీని.. అక్కడి చెట్లను అవాసంగా మలుచుకున్న వానరాలు.. అన్ లాక్ తరువాత కాలేజీలు తెరుచుకున్నా తమ అవాసాన్ని మార్చుకోలేక.. అక్కడే తిష్టవేశాయి. అయితే పోనీలే మూగజీవాలు ఇక్కడే వున్నా పర్వాలేదు.. బుద్దిగా వుంటే అనుకుంటున్నారా.? అవి మనుషులు కావు.. కోతులు కాబట్టే బుద్దిగా ఉండకుండా పౌచులు, చున్నిలు ఎత్తుకెళ్తున్నాయి. అంతటితో ఆగకుండా విద్యార్థినులు టిఫిన్ బాక్స్ లను కూడా ఎత్తుకెళ్లి స్వాహా చేస్తున్నాయి.. దీంతో విద్యార్థినిలు తరగతి గదిలో కూర్చునేందుకు బయపడుతున్నారు.
చదువు మీద శ్రద వహించలేకపోవడంతో పాటు ఎప్పుడు, ఎటువైపు నుంచి కోతులు వస్తాయో తెలియకుండా.. ఎక్కడా దాడి చేస్తాయోనన్న భయంతో విద్యార్థినులు జంకుతున్నారు. దీంతో వానరాల నుంచి రక్షణ కల్పించాలని కాలేజీ ప్రిన్సిపల్ పిర్యాదు చేసిన అటవిశాఖ అధికారులు స్పందిచలేదని కాలేజీ యాజమాన్యం అరోపించింది. దీంతో కలెక్టర్ కు పిర్యాదు చెశామని చెప్పింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరుగుతోందో తెలుసా.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి ప్రాంతంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో విద్యార్థినులు కొతుల బెదడతో చదువుపై ద్యాస పెట్టలేకపోతున్నారు.
విద్యార్థులు కాలేజీ తరగతి గదిలోకి వెళ్లగానే ఇక వాటి ఆగడాలకు అంతులేకుండా పోతోందని విద్యార్థినులు బాధను వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలోని ఒక చోట నుంచి మరోచోటికి ఎగురుతూ, నడుస్తూ.. చెట్ల కొమ్మలు పట్టుకుని ఊగుతూ.. ఉపాధ్యాయులు, విద్యార్థులు తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ లను ఎత్తుకెళుతున్నాయి.. విద్యార్థుల పౌచులు, చున్నిలను కూడా ఎత్తుకెళుతున్నాయి. విద్యార్థినులు, ఉపాధ్యాయుల పిర్యాదులు ఎక్కువకావడంతో కాలేజీ ప్రిన్సిఫల్, లెక్చరర్లు ఆటవి శాఖ అధికారులకు ఫిర్యాదు చేసారు. అయినా వారు పట్టించుకోలేదు. దీంతో జిల్లా కలెక్టర్ సీ.నారాయాణ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లామని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more