కార్మికుల సమస్యల పరిష్కారించేందుకు, వారి సంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగాల్పిన కార్మిక నేత దారి తప్పాడు. కార్మిక నేత హోదాలో తోటి కార్మికుడికి తానే సమస్యగా మారాడు. తన కాలనీలోనే నివాసం ఉంటున్న మరో కార్మికుడి భార్యపై కన్నెసి.. అమెను అనునిత్యం లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో అమె విషయాన్ని పోలీసులకు కూడా చేరవేసింది. పోలీసులు కేసు నమోదు చేసేందుకు సుముఖత చూపకపోవడంతో దారితప్పిన కార్మిక నేతను బుద్ది చెప్పాలనుకుంది. అంతే అతడి ఆడియోను లీక్ చేసింది. వెనువెంటనే అది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. సింగరేణి కాలరీస్ ఇల్లందు ఏరియాలోని తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు తన కాలనీలోని మరో కార్మికుడి భార్యను కొద్దికాలంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. తరచూ ఫోన్ చేసి.. తన కోరికలను తీర్చాలని కోరుతున్నాడు. నిత్యం తన కలలోకి వస్తున్నావ్.. వచ్చి ఏం చేస్తున్నావో చెప్పాలంటే మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంటికి వస్తే చెబుతానని అంటున్నాడు. అసభ్యకర సైగలు చేస్తూ వెకిలి చేష్టలకు పాల్పడుతున్నాడు.
నిందితుడి వేధింపులు భరించలేని బాధితురాలు అతడు తనతో ఫోన్ లో మాట్లాడిన సంభాషణను వాయిస్ రికార్డు చేసింది. ఆ వెంటనే ఆధారాలతో సహా ఇల్లందు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే నిందితుడ్ని పిలిచిన పోలీసులు అతడితో రాజీ కుదర్చారు. ఇకపై వేధింపులకు పాల్పడబోనని కార్మికనేత లిఖితపూర్వకంగా రాసివ్వడంతో విషయం సద్దుమణిగింది.
ఇదిలా ఉంటే సదరు నేతపై కేసు బనాయించకుండా అధికార పార్టీ అండదండలు కాపాడినా.. అతడికి మరింతగా బుద్ది చెప్పాలని భావించిన వివాహిత.. నిందితుడు తనతో మాట్లాడిని ఆడియోను నెట్టింట్లో లీక్ చేసింది. దీంతో అతడి బండారం బయటపడింది. అది కాస్తా నెట్టింట్లో వైరల్ కావడంతో పోలీసులు అఘమేఘాల మీద కార్మిక నేతపై కేసు నమోదు చేశారు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ బర్పటి రమేష్ స్పందిస్తూ కార్మిక నేతపై మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయబోతున్నట్లు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more