కరోనా వైరస్తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. వైద్యుల కృషితో త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే చాలామంది వ్యాక్సిన్ మీద అపనమ్మకంతో వేసుకోవడానికి ముందుకురావడంలేదు. వైరస్కు విరుగుడుగా ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకోవాల్సి ఉండగా.. చాలామంది ఒక డోస్ మాత్రమే వేసుకొని, మరో డోసు వేసుకోవడంలేదు. అలాంటి వారితో రెండో డోసు కూడా వేయించాలనే ఉద్దేశంతో ఇజ్రాయేల్ దేశంలోని టెల్ అవీవ్ పట్టణంలో ఒక స్పెషల్ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఆ దేశంలోని 9 మిలియన్ల జనాభాలో ఇప్పటివరకు 43 శాతానికి కన్నా ఎక్కువ మంది ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. కానీ, రెండో డోసు తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. దాంతో టెల్ అవీవ్ మున్సిపాలిటీలోని జెనియా గ్యాస్ట్రోపబ్ అందరినీ ఆకట్టుకునే ఆఫర్ను పెట్టింది. ఎవరైతే రెండో వ్యాక్సిన్ వేసుకుంటారో వారికి తమ పబ్లో ఫ్రీ బీర్ ఇస్తామని ఆఫర్ పెట్టింది. అంతేకాకుండా వ్యాక్సిన్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదని.. తమ దగ్గరే వ్యాక్సిన్ వేసుకునే సదుపాయం కూడా ఉందని తెలిపింది.
ఇంకేముంది.. బీరు ప్రియులు ఆ పబ్ ముందు బారులు తీరారు. అటు వ్యాక్సిన్ వేయించుకోవచ్చే.. ఇటు బీరు తాగొచ్చు అని జనాలు వ్యాక్సిన్ వేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. ‘టీకా వేసుకోవడానికి ఇది మంచి అవకాశం. నాకు వ్యాక్సిన్ సెంటర్కు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవడానికి టైం కుదరడంలేదు. అందుకే పబ్లో వ్యాక్సిన్ వేయించుకున్నా. అటు వ్యాక్సిన్ వేయించుకున్నా.. ఇటు బీరు తాగాను’ అని మే పెరెజ్ అనే వ్యక్తి తెలిపాడు.
వ్యాక్సినేషన్ బార్ ఏర్పాటు చేయడంపై పబ్ యాజమాన్యం కూడా సంతోషంగా ఉంది. ‘కరోనా టైంలో పబ్లు, బార్లు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే బిజినెస్ ఊపందుకుంటుంది. పబ్లిక్ను ఆకర్షించడం కోసం ఈ ఆఫర్ పెట్టాం. అటు వ్యాక్సిన్ వేస్తూ కరోనాను నిర్మూలిస్తున్నాం.. అదే సమయంలో మా బిజినెస్ కూడా పెంచుకుంటున్నాం. వ్యాక్సిన్ తీసుకున్న వారికోసం నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ను ఫ్రీగా అందిస్తున్నాం’ అని ఆ పబ్ ప్రతినిధి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more