అరగంట పాటు ఈత కోడితేనే హమ్మా.. దేవుడా అంటూ అపసోపాలు పడతాము.. కానీ తాను ఏం చేస్తున్నానో కూడా పెద్దగా గుర్తుపెట్టుకోలేని ఓ పన్నెండేళ్ల చిన్నారి బాలిక.. అరేబియా సముద్రంలో 36 కిలోమీటర్లు ఈత కొట్టి రికార్డు సృష్టించింది. బుద్దిమాంద్యంపై అవగాహన కల్పించేందుకు అదే సమస్యను ఎదుర్కోని చికిత్స పొందిన చిన్నారి.. తన చికిత్స పూర్తైన నేపథ్యంలో ఈ అరుదైన సాహసోపేత ఫీటుకు నడుం చుట్టింది. నేవీకి చెందిన సైలర్ మదన్ రాయ్ కుమార్తె అయిన 12 ఏళ్ల చిన్నారి జియా రాయ్ ఈ ఘనత సాధించింది.
ముంబైలోని బాంద్రా-వర్లి సీ లింక్ నుంచి 36 కిలోమీటర్ల దూరంలోని గేట్ వే ఆఫ్ ఇండియా వరకు సముద్రంలో ఈత కొట్టి కేవలం 8 గంటల 40 నిమిషాల్లో చేరుకున్నది. ఉదయం నాలుగు గంటల సమయంలో ప్రారంభమైన అమె ఈత.. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు పూర్తైంది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (బుద్దిమాంద్యత)గురించి అవగాహన కల్పించడంలో భాగంగా జియా రాయ్ ఈ ప్రయత్నం చేసి చరిత్ర సృష్టించిందని రక్షణ మంత్రిత్వశాఖ ముంబై విభాగానికి చెందిన పీఆర్ఓ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
జియా సాహసోపేతమైన ఫీటును విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో అమెకు స్విమ్మింగ్ ఫెడరేషన్ అప్ ఇండియా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అభయ్ దధే అవార్డుతో పాటు సర్టిఫికేట్ ను కూడా అందజేశారు. అమె పదవ ఏట నుంచే ఈత నేర్చుకుంటోందని అయితే రెండేళ్లలోనే ఇంతటి ఘనత సాధిస్తోందని తాము ఊహించలేదని అన్నారు అమె తల్లి. ఇక జియా రాయ్ ఈత ను మహారాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ తో పాటు భారత్ యువ, క్రీడా వ్యవహరాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫిట్ ఇండియా మూమ్ మెంట్ సంయుక్తంగా పర్యవేక్షించాయి. ఈ చిన్నారికి నెట్టింట్లో ప్రశంసలు వర్షం కురుస్తుంది. నీ దారి పూల దారి అంటూ అందరూ జేజేలు పలుకుతున్నారు.
#Watch Another short clip pic.twitter.com/VkS22FgToK
— PRO Defence Mumbai (@DefPROMumbai) February 18, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more