ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు, సమైక్యాంద్ర ఉద్యమ నేత చలసాని శ్రీనివాస్ కూతురు శీరిష్మ (27) ఆనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని రాయదుర్గం పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిశీలించారు. ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్న శిరీష్మకు నాలుగేళ్ల (2016)క్రితం ఓయు కాలనీలోని ట్రయల్ విల్లాస్ లో నివసించే గ్రానైట్ వ్యాఫారి సిద్ధార్థ్ తో వివాహం జరిగింది. గతకొంతకాలంగా శిరీష్మ మానిసిక సమస్యతో బాధపడుతుందని తెలుస్తోంది.
నాలుగేళ్లయినా వీరికి సంతానం కలగకపోవడంతో అమె మానసికంగా కుంగీపోయిందని సమాచారం. దీంతో వారు గత కోంత కాలం క్రితం వీరిద్దరూ గచ్చిబౌలిలోని ఐకియా స్టోర్ సమీపంలోని అపార్టుమెంటుకు మారి.. అక్కడే నివసిస్తున్నారు. అయినా అమెలోని డిప్రెషన్ ను ఈ మార్పు కూడా నయం చేయలేకపోయింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి అమె ఇంట్లోని ఫ్యాన్ కు చీరతో ఉరి బిగింది ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. వ్యాపారం ముగించుకుని అమె భర్త ఇంటికి వచ్చేలోగా అమె ఈ విపరీత చర్యకు పాల్పడింది.
బుధవారం రాత్రి యధావిధిగా ఇంటికి వచ్చిన అమె భర్త సిద్దార్థ్ అమె ఇంట్లో ఉరి వేసుకున్న విషయాన్ని గమనించి.. హుటాహుటిన అమెను కిందకు దింపి చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించగా అప్పటికే అమె మరణించిందని వైద్యులు నిర్థారించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి చలసాని శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు గురువారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more