పర్యావరణ సమతుల్యం కారణంగా సంభవించిన ప్రకృతి ప్రకోపంతో ఉత్తరాఖండ్ లో జలవిలయం సంభవించి 170 మంది గల్లంతయ్యై, ఇరవై మంది వరకు మరణించిన ఘటన దేశ ప్రజలకు తీవ్ర అందోళనకు గురి చేసింది. 2014లో సంభవించిన ఉత్తరాఖండ్ హిమాలయ సునామీని గుర్తుకు తెచ్చింది. ఈ దుర్ఘటనలో జలవిద్యుత్ కేంద్రాలు, వంతెనలు, నామరూపాల్లేకుండా కొట్టకుపోయాయి. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా జోషిమర్ సమీపంలో నందాదేవి-హిమానీనదంలోని పెద్ద మంచు చరియలు విరిగి దోలిగంగా నదిలో పడిటంతో అకస్మాత్తుగా దొలిగంగ, రుషిగంగా, అలకనంద నదులు మధ్య వరదలు సంభవించాయి.
దీంతో తపోవన్ రేణి వద్ద ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తపోవన్- విష్ణుగడ్ ల మధ్య 480 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రంలోకి నీరు ప్రవహించింది. ఇక్కడ పనిచేస్తున్న 170 మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో 16 మందిని క్రితం రోజున ఐటీబీపీ-ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షించాయి. కాగా దౌలిగంగా నదిలో మళ్లీ నీటి ఉద్దృతి పెరగడంతో పాటు చీకటి పడిన కారణంగా సహాయక చర్యలు ముగించిన అధికారులు.. ఇవాళ తెల్లవారు జామునుంచే మళ్లీ సహాయక చర్యలను ప్రారంభించారు. కార్మికుల కోసం డెహ్రడూల్ నుంచి ఒకటి, ఢి్లీ నుంచి నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఇక ఘజియాబాద్ నుంచి మరో ఆరు బృందాలు చేరుకుగా, 600 మంది సైనికులు కూడా సహాయచర్యల్లో పాల్గోన్నారు.
సోరంగంలో మరో 30 మంది కార్మికులు చిక్కకున్నారని, తమకు సమాచారం అందిందని ఐటీబీపి అధికార ప్రతినిధి తెలిపారు. వీరిందరినీ కాపాడేందుకు దాదాపు 300 మంది ఐటీబీపి జవాన్లు శ్రమిస్తున్నారని తెలిపారు. అయితే సొరంగంలో వున్నవారిని నిన్న సాయంత్రమే కాపాడామని, అయితే మరో టన్నెల్ లో వున్న కార్మికులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. కాగా అనధికార వర్గాల సమాచారం ప్రకారం ఏకంగా సొరంగంలో 170 మంది కార్మికులు గల్లంతయ్యారని వార్తలు వస్తున్నయన్న అంశంపై ఆయన స్పందింస్తూ ముందుగా సొరంగంలో వున్నవారిని రక్షించడంపైనే తాము దృష్టి సారించామని అన్నారు,
దౌలిగంగా నదిలో అకస్మాక వరదలు సంభవించిన దుర్ఘటనలో ఉత్తరాఖండాలోని దాదాపు నిర్మితమైన ఓ జలవిద్యుత్ కేంద్రం పూర్తిగా కొట్టుకుపోగా, మరో విద్యుత్ కేంద్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని చమోలీ జిల్లా జోషిమర్ సమీఫంలోని సందాదేవి- హిమానీనదంలోని పెద్ద మంచు చరియలు విరిగిపడి దౌలిగంగా నదిలో పడిన కారణంగా ఈ నది ఒడ్డున తపోవన్- రేణి వద్ద నిర్మితం అయిన ఎన్టీపీసీ 480 మెగావాట్ విద్యుత్ కేంద్రం పూర్తిగా కొట్టకుపోయింది. ఇక మలారీ లోయలో వున్న భారీ వంతెనలు కూడా పూర్తిగా కొట్టకుపోయినట్టు అధికారులు తెలిపారు, చైనా సరిహద్దుల్లోని బోర్డర్ పోస్టులకు వెళ్లేందుకు ఈ వంతనే కీలకం కాగా, దీనితో పాటు మరో నాలుగు వంతెనలు కూడా ధ్వంసమయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more