ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శరవేగంగా ఎన్నికల పనులకు పూనుకున్నారు. సోమవారం రోజునే పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేసిన ఆయన ఆ తరువాత గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టరల్తో పాటు తిరుపతి అర్భన్ ఎస్సీని వెంటనే బదిలీ చేయాలని అదేశాలు జారి చేశారు. ఆయన అదేశాలపై నిన్నటి వరకు దూరంగా వ్యవహరించిన రాష్ట్రప్రభుత్వం కూడా సుప్రీం తీర్పు నేపథ్యంలో వేగంగానే స్పందిస్తోంది.
పంచాయతీ ఎన్నికల విధుల నుంచి గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లతో పాటు తిరుపతి అర్భన్ ఎస్సీని దూరంగా వుంచుతూ తాజాగా అదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు వీరు సాధారణ పరిపాలన బాధ్యతలను చూసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గుంటూరు కలెక్టర్ సామ్యూల్ ఆనంద్ కుమార్, చిత్తూరు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, తిరుపతి అర్భన్ ఎస్పీ రమేష్ రెడ్డీలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ కు పిర్యాదు చేశారు. దీంతో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ డి మార్కండేయులు జిల్లా ఎన్నికల అధికారులుగా అదనపు బాధ్యతలను చేపట్టారు. ఇటు చిత్తూరు ఎస్పీ సెంధిల్ కుమార్ కూడా అర్భన్ ఎస్పీగా బాధ్యతలను నిర్వహించనున్నారు.
ఇక రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శఇ గోపాలకృష్ణ ద్వివేదీ, గ్రామీణాభివృద్ది శాఖ కమీషనర్ గిరిజా శంకర్ లను కూడా బదిలీ చేస్తూ.. వారిపై అభిశంసన ప్రోసీడింగ్ ఇచ్చారు నిమ్మగడ్డ. రాష్ట్ర ఎన్నికల కమీషన్ అదేశాలను పాటించడంలో వీరు పూర్తిగా విఫలమయ్యారని, వీరి వల్లే 2021 ఓటర్ల జాబితా సిద్దం కాలేదని, అందుకు తీసుకోవాల్సిన చర్యలను వీరు చేపట్టకపోవడంతోనే గత్యంతరం లేని పరిస్థితుల్లో 2019 ఓటర్ల జాబితాతోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర యువత ఓటు హక్కును కోల్పోడానికి ఈ ఇద్దరే ముఖ్యకారణమని ఆయన తన అభిశంసనలో పేర్కోన్నారు. ఈ అభిశంసనలను వారి సర్వీసు రికార్డుల్లోనూ చేర్చాలని అదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more