ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు అదేశాలిస్తూ.. ఎన్నికలను వాయిదా వేయాలని దాఖలైన పిటీషన్లు అన్నింటినీ తిరస్కరించిన వెంటనే ఆయన రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల నిర్వహణ తేదీలను మార్చుతూ రీషెడ్యూల్ చేశారు. దీంతో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి నాలుగు విడతల్లో జరగాల్సిన ఎన్నికలు ఫిబ్రవరి 9 నుంచి నాలుగు విడుతల్లో జరగనున్నాయి.
గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో ఫిబ్రవరి 5, 9, 13, 17న ఎన్నికలు జరగాల్సి వుంది. అయితే తాజాగా విడుదల చేసిన రీషెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాగా, గతంలో రెండో విడత ఎన్నికలను తాజా షెడ్యూలు ప్రకారం తొలి విడతగా, గత మూడో విడత ఎన్నికలను తాజాగా షెడ్యూలు ప్రకారం రెండో విడత ఎన్నికలుగా, గత నాలుగో విడత ఎన్నికలను తాజా షెడ్యూలు ప్రకారం మూడో విడతగా నిర్వహించనున్నారు. ఇక తొలి విడత ఎన్నికలను ఈ నెల 21కి వాయిదా వేస్తూ తాజా షెడ్యూలు ప్రకారం ఇదే నాలుగో విడత ఎన్నికగా నిర్వహించనున్నారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానం గ్రామ పంచాయతీ ఎన్నికలపై తీర్పును వెలువరించిన తరువాత ఈ మేరకు ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో ఎన్నికలకు సిద్దం కానందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తొలి విడత ఎన్నికలకు ఈ నెల 29 నుంచి, రెండో విడతకు ఫిబ్రవరి 2, మూడో విడతకు ఫిబ్రవరి 6, నాలుగో విడతకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎమ్మార్వోలు ఎన్నికల సిబ్బంది తగిన రీతిలో సిద్దం కావాలని కూడా అయన అదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more