ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటీషన్లను న్యాయస్థానం ఈ సందర్భంగా తోసిపుచ్చింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను యధావిధిగా నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం అదేశాలను జారీ చేసింది.
పంచాయతీ ఎన్నికల నిర్వహణ చేపట్టాలంటూ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ పిటీషన్ పై విచారించిన సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని రెండు విభిన్న అధికారాల మధ్య పంచాయతీ ఎన్నికల సమస్య తలెత్తడానికి తమ మాట గెలిచి తీరాలన్న పంతం ఉతన్నమైందని, దీంతో రాష్ట్రంలో చట్టబద్దత లోపించడానికి కారణంగా మారుతోందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అధికారాల మధ్య పంతంలో తాము భాగం కాదల్చుకోలేదని పేర్కోంది.
విచారణ సంరద్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు, పంచాయతీ రాజ్ అధికారులు ఎలా తీర్మాణాలను చేస్తారని, వాటిని ఎలా అమోదిస్తారని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య పంచాయతీ ఎన్నికల నిర్వహణ సమస్య ఉత్పన్న కావడం వెనుక మరేదో కారణం వుందని అనుమానం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని పలు విభాగాలకు పలు బాధ్యతలు వుంటాయని, వాటిన్నింటి నిర్వహణను తాము తీసుకోలేమని చెప్పింది. ఎన్నికల నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, అది వారే చేయాలని న్యాయస్థానం పేర్కోంది.
కాగా కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. గోవా సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయని.. వాక్సినేషన్ డ్రైవ్ ఫిబ్రవరి 28 నాటికి పూర్తైన తరువాత మార్చిలో నిర్వహించుకోవచ్చునని వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పును కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కారణంగా వెలువరించకుండా ఎన్నికల నిర్వహణను వాయిదా వేసిన హైకోర్టు సింగిల్ జడ్జీ తీర్పును మీరు సమర్ధిస్తున్నారా.? అంటూ న్యాయస్థానం ఆయనను ప్రశ్నించింది. ఇక కరోనా సమయంలోనే పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయని, ఇక వాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికల వాయిదా సముచితం కాదని ధర్మాసనం పేర్కోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more