(Image source from: Twitter.com/ANI)
మహారాష్ట్రలో ఒంటరిగా అధికారంలోకి రావడానికి ప్రస్తుతం అపసోపాలు పడుతున్న శివసేన పార్టీ.. త్వరలోనే జాతీయ పార్టీగా మాత్రం ఎదగాలని యోచనలో వుంది. అందుకు అనుగూణంగా పలు రాష్ట్రాలలో తమ సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతుంది. మహారాష్ట్రలోని మరో బలమైన పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి) తరహాలోనే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించుతోంది, ఇటీవల బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలోనూ తమ అభ్యర్థులను బరిలోకి దింపిన శివసేన పార్టీ రానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై తాజాగా స్పష్టత నిచ్చింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాము పోటీ చేయబోతున్నట్టు శివసేన ప్రకటించింది.
ఈ మేరకు శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సామాజిక మాద్యమం ద్వారా వెల్లడించారు, శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేతో జరిగిన సమావేశం అనంతరం తన అధికార ట్విట్టర్ అకౌంట్ ద్వారా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తాము పోటీ చేయనున్నామని పేర్కోంటూ అటు పార్టీ అభిమానులు, కార్యకర్తలతో పాటు మీడియాతో పంచుకున్నారు, ఇదిలావుండగా, 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసిన శివసేన ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ ఎన్నికలలో తమ అభ్యర్థులను రంగంలోకి దింపిన పార్టీ డిపాజిట్లు సైతం రాబట్టుకోలేని పరిస్థితిల్లోకి జారుకుంది, మొత్తంగా 22 స్థానాల్లో పోటీ చేసినా 0.05 శాతం ఓట్లను కూడా రాబట్టుకోలేకపోయింది. మరోలా చెప్పాలంటే.. ‘నోటా’కు వచ్చిన ఓట్ల కంటే కూడా అత్యంత తక్కువ ఓట్లను శివసేనకు పోలయ్యాయి.
మరోవైపు సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఆ పార్టీ తాజాగా కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కూడా మహారాష్ట్రలో కలిపేందుకు కట్టుబడి వున్నామంటూ మరో సంచలనానికి తెరలేపింది, ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది, మరాఠా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రితం రోజున ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు. మహారాష్ట్ర ఏకీకరణ సమితి సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ మహారాష్ట్ర ముఖ్మమంత్రి ఈ మేరకు ట్వీట్ చేశారు.
So, here is the much awaited update.
— Sanjay Raut (@rautsanjay61) January 17, 2021
After discussions with Party Chief Shri Uddhav Thackeray, Shivsena has decided to contest the West Bengal Assembly Elections.
We are reaching Kolkata soon...!!
Jai Hind, জয় বাংলা !
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more