కోటి రూపాయాల లంచం డిమాండ్ చేసిన రైల్వే సీనియర్ అధికారిని సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ ఇంతటి భారీ మోత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి అడ్డంగా దోరికిపోయిన అధికారి కేసు సీబీఐ చరిత్రలోనే అతిపెద్ద కేసుగా కీలకంగా మారింది, ఈశాన్య సరిహద్దు రైల్వేస్ విభాగంలో ఇంజినీరింగ్ సర్వీస్ సీనియర్ అధికారి (ఐఆర్ఈఎస్) సహా మరో ఇద్దరు అధికారులను కూడా సీబిఐ అధికారులు అరెస్టు చేశారు, వీరి డిమాండ్ చేసిన కోటి రూపాయల లంచం డబ్బుతో పాటు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ పలు కాంట్రాక్టు పనులను ఓ సంస్థకు అందించేందుకు ఈ ఉన్నతాధికారి సహా మరో ఇద్దరు అనుబంధ అధికారులు ఈ పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్ చేసినట్లు సిబిఐ అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే,, అస్సాం రాజధాని గువాహటి సమీపంలోని మాలిగావ్ లోఈశాన్య సరిహద్దు రైల్వేస్ విభాగంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (సీఏఓ) / కన్స్ట్రక్షన్- II గా నియమితుడైన 1985 బ్యాచ్ అధికారి... మహేందర్ సింగ్ చౌహాన్ తన పరిధిలోని రైల్వే విభాగంలో అభివృద్ది పనులను ఓ సంస్థకు కేటాయించేందుకు గానే సంబంధిత సంస్థ నుంచి కోటి రూపాయల లంచాన్ని డిమాండ్ చేశారు, ఈ డబ్బును ఏర్పాటు చేసిన ఏబిసీఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ అందిస్తుండగా రంగంలోకి దిగిన సీబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు, గతంలోనూ పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడినప్పటికీ ఇది మాత్రం సీబీఐ చరిత్రలోనే అతిపెద్ద కేసుగా అధికారులు పేర్కొన్నారు.
ఈ కేసులో భాగంగా సీబీఐ అధికారులు దేశ్యాప్తంగా ఢిల్లీ, ఉత్తరాఖండ్, అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ లోని 21 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి రూ.54 లక్షలను స్వాధీనం చేసుకున్నారు, గతంలోనూ ఇదే అధికారికి లంచం ఇచ్చామన్న అభియోగాలు నమోదైన కేసులోని రూ. 60 లక్షలను కూడా సీబిఐ దాడుల నేపథ్యంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు, ఈ కేసులో మహేంద్ర సింగ్ చౌహన్ తో పాటుగు ఢిఫ్యూటీ చీఫ్ ఇంజనీర్ హేమ చంద్ బోరా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీకాంత్ వర్మపై కూడా అభియోగాలు మోపబడ్డాయి. వీరితో పాటు ఏబిసీఔ ఇన్ ఫ్రా డైరెక్టర్ పవన్ బైద్ "సహా సంస్థ ఉద్యోగి భూపేంద్ర రావత్, రైల్వే అధికారి సమీప బంధువు ఇంద్ర సింగ్ పేరు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈశాన్య సరిహద్దు రైల్వే విభాగంలోని కొందరు ఉన్నతాధికారులు బాగా లంచాలకు అలవాటు పడి ప్రైవేటు కాంట్రాక్టర్లతో కలిసి అవినీతి చర్యలకు పాల్పడుతున్నట్లు అరోపణలు రావడంతో ఈ ప్రాంతంలోని రైల్వే అధికారులపై సీబిఐ అధికారులు నిఘా పెట్టారు, కాంట్రాక్టులను భద్రపరచడం, తదుపరి బిల్లుల ప్రాసెసింగ్, చెల్లింపులు సహా ఇతర పనులలోనూ కాంట్రాక్టర్లకు అనుగూణంగా అధికారులు వేగవంతమైన సేవలను అందిస్తున్నారు, అందుకు భారీగా సోమ్ము కూడా లంచాల రూపంలో చేతులు మారుతుందని పసిగట్టిన సిబిఐ అధికారులు ఎట్టకేలకు పెద్ద అవినీతి జలగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఊచలు లెక్కపెట్టిస్తున్నారు, కాగా, నకిలీ బిల్లుల క్లియరన్స్ కేసులో సీబీఐ గతేడాది నలుగురు అధికారులపై కేసులు నమోదు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more