(Image source from: Timesofindia.indiatimes.com)
ప్రపంచ దేశాలన్నీ శాంతిసందేశం ఇస్తూ.. యుద్దాలకు దూరంగా అభివృద్దిలో వేగంగా దూసుకెళ్లి ఏ దేశంతోనైనా ఆర్థికంగా, అభివృద్ది పరంగా పోటీ పడేందుకు సిద్దపడుతున్న తరుణంలో చైనా మాత్రం తమ రూటు సపరేట్ అంటూ మరోమారు నిరూపించుకుంది. సైనిక బలగాలపై అధ్యక్షునికి విస్తృత అధికారాలను కల్పిస్తూ కొత్త రక్షణ చట్టం అమలులోకి వచ్చిన సందర్భంగా రక్షణ మంత్రిత్వశాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సైనికుల సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తమ దేశ సైన్యాని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి, ఇంతకీ అంతగా వేడిరాజేసిన వ్యాఖ్యలు ఏంటంటే..
దేశం ఏ క్షణాన యుద్దం వచ్చినా.. వాటిని పూర్తి సన్నధ్ధతతో పోరాడేందుకు సిద్దంగా ఉండాలని ఆయన తమ దేశ సైన్యమైన పీపుల్స్ ఆర్మీకి అప్రమత్తతతో కూడిన సందేశాన్ని అందించారు. అంతేకాదు తమ ఆర్మీ వాస్తమ యుద్దరంగాన్ని తలపించే పరిస్థితుల్లో ఆర్మీ శిక్షణ పోందాలని కూడా సూచించారు. దీంతో అసలు చైనా అధ్యక్షుడి వాఖ్యలు దేనికి ఆజ్యం పోస్తున్నాయని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇక దీంతో పాటు సైనికులు పోరాట నైపుణ్యాన్ని మరింతగా మెరుగుపరచుకోవాలని ఆయన సూచించారు.అధునాతన ఆయుధాలను వాడే విధానం, వాటి ప్రయోగాల విషయంలో పూర్తి అవగాహన కలిగి వుండాలని జిన్ పింగ్ అభిప్రాయపడ్డారు.
పోరాట వ్యూహాలపై మరింత పరిశోధనలు చేయాలని, యుద్దం వచ్చిన నేపథ్యంలో శత్రువర్గాలపై విజయాన్ని అందుకునేలా వ్యూహాలను కూడా రచించే సత్తా వుండాలని సూచించారు. కాగా, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆయన, కేంద్ర సైనిక కమిషన్ అధిపతిగానూ ఉన్నారు. ఈ కమిషన్ కు సంబంధించిన తొలి ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. చైనా అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలపై దుమారం రేగుతుంటూ.. చైనా మాత్రం తమ దేశ అధ్యక్షుడు పీప్సుల్స్ ఆర్మీని సన్నధంగా, జాగృతంగా ఉంచేందుకు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలను వినియోగించారని క్లారిటీ ఇస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more