(Image source from: India.com)
భారత సరిహద్దులోని నియంత్రణ రేఖ పోడువునా ఏకంగా 400 తీవ్రవాదులు మాటువేసి వున్నారని, వారంతా భారత్ తోకి చోరబడేందుకు సిద్దంగా వున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం రావడంతో భారత భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి, భారత్ లో ఉగ్రదాడులు చేసే కుట్రలతో వీరిని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు పంపుతున్నాయని ఇ:టెలిజెన్స్ సమాచారం, దీంతో సరిహద్దుల్లో దాదాపు 400 మంది వరకూ ఉగ్రవాదులు చేరారని వారంతా అదును చూసుకుని సరిహద్దు దాటేందుకు కాసుకున్నారని.. ఈ నేపళ్యంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అప్రమత్తంగా వుండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ చేశాయి.
శీతాకాలంలో పగలు ఉప్ణోగ్రతలు అత్యల్పంగా పడిపోతున్న తరుణంలో అదే అదనుగా భావించిన పాకిస్థాన్ ఉగ్రసంస్థలు వారిని భారత్ లోకి చోరబడేందుకు సహకరించనున్నాయి, అయితే తాజాగా భారత్ పాకిస్థాన్ మధ్య సరిహద్దులో ఏర్పాటు చేసిన చోరబాట్ల నిరోధక గ్రిడ్ లోంచి చోరబడేందుకు పాకిస్థాన్ ఉగ్రసంస్థలు చేసిన ప్రయత్నాలు కూడా బెడసికోట్టాయని భారత భద్రతా బలగాలు తెలిపాయి, దీంతో చోరబాట్లకు గ్రిడ్ అనుకూలంగా లేదని పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణకు తెగబడుతోందని భారత అధికారులు తెలిపారు, గత ఏడాదిలో ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నా పాకిస్థాన్ మాత్రం ఏకంగా 5100 పర్యాయాలు కాల్పుల విరమణకు తెగబడిందని భారత అధికారులు తెలిపారు.
భారత దళాలపై దాడులు చేయాలన్న వ్యూహంతో ఉన్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరి వద్ద జీపీఎస్, నావిగేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయని, వాటిని ఐఎస్ఐ సమకూర్చిందని, వివిధ లాంచ్ ప్యాడ్ల వద్ద వీరు నక్కి ఉన్నారని పేర్కొన్నాయి. వాస్తవానికి గత నవంబర్ లోనే ఉగ్రవాదులు ఒక చోటకు చేరుతుండటంపై ఇంటెలిజన్స్ కు ఉప్పందింది. కశ్మీర్ లోయ సమీపంలో 65 మంది టెర్రరిస్టులు ఆయుధాలతో సహా ఉన్నారని, వారు ఏ క్షణమైనా జొరబడవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. శీతాకాల పరిస్థితులు తమకు అనుకూలమని భావిస్తున్న ఉగ్రవాదులు, లునియా ధోక్, చిరికోట్ నబన్, దేగ్వార్ ట్రెవాన్, పీపి నాలా, కృష్ణ ఘాటి, భీంబర్ గాలి, నౌషెరా, సుందర్బానీ తదితర లాంచ్ ప్యాడ్లకు చేరారని తెలుస్తుండటంతో సరిహద్దుల్లో పహారాను మరింత కట్టుదిట్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Jan 25 | 2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు,... Read more
Jan 25 | కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్... Read more
Jan 25 | వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా... Read more