ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు సంచలనవ్యాఖ్యలు చేసింది. మిషన్ బిల్డ్ ఏపీ కేసులో సంబంధిత ఐఏఎస్ అధికారిపై ఏపీ రాష్ట్రోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసిన సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులకు ఎక్కడలేని ధైర్యం వచ్చిందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ ఆస్తుల విక్రయం కేసులో తుది విచారణ పూర్తికాకుండానే రెక్యూసల్ పిటీషన్ వేయడాన్ని ఆయన తప్పబట్టారు.
కేసులో తుది విచారణ మొదలు కాకుండానే అవాంఛనీయ రీతిలో ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలు కావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. డివిజన్ బెంచ్ సభ్యుడిగా ఉన్న న్యాయమూర్తిపై ఐఏఎస్ అధికారి చాలా క్రూరమైన ఆరోపణలు చేశారన్నారు. జగన్ లేఖ తర్వాత ప్రభుత్వ అధికారుల్లో ఎక్కడలేని ధైర్యం వచ్చిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది న్యాయవ్యవస్థ పటిష్టతలను దెబ్బతీసే చర్యగానే ఆయన పేర్కోన్నారు. తీర్పులను ఆధారంగా చేసుకుని న్యాయమూర్తులను టార్గెట్ గా చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి నిర్బంధ ఆంగ్ల బోధనను ప్రవేశపెట్టే ఉత్తర్వును కోర్టు కొట్టివేసిన మరుక్షణం నుంచి హైకోర్టు పైన, ఒక న్యాయమూర్తిపైనా అశ్లీల, అభ్యంతరకర, అగౌరవమైన భాషలో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయని జస్టిస్ రాకేశ్ కుమార్ గుర్తు చేశారు. వాటిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీఐడీ ఎస్పీ సారథ్యంలోని సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేక పోస్టులపై నిమిషాల వ్యవధిలో స్పందించే యంత్రాంగం.. న్యాయమూర్తులపై పోస్టులు పెడితే మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more